ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు కొనసాగుతున్నాయి,రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. SIPB తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది, రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ కంపెనీల రాకతో యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖపట్నం, తిరుపతి, శ్రీసిటీ వంటి ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్టీ వంటి పెద్ద కంపెనీలు కూడా ప్రభుత్వంతో ఒప్పందాలకు ఆమోదం తెలిపారు.విశాఖపట్నం బీచ్ రోడ్డు(Visakhapatnam Beach Road)లో తాజ్ గేట్వేను వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేయనుంది. ఇది 5-స్టార్ డీలక్స్ హోటల్గా, సర్వీస్ అపార్ట్మెంట్స్గా మారుతుంది. దీనికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఈ ప్రాజెక్టులో రూ.899 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. దీని ద్వారా 1,300 మందికి ఉద్యోగాలు వస్తాయి. తిరుపతిలో స్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు హోటల్స్ నిర్మించనుంది. అవి ఐబీఐఎస్ స్టైల్స్ 3-స్టార్ హోటల్, నోవోటెల్ 5-స్టార్ హోటల్. దీనికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఈ ప్రాజెక్టులో రూ.327 కోట్ల పెట్టుబడితో 570 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. తిరుపతిలోని ఎస్వీపురం వడమాలపేటలో బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ ఎల్ఎల్పీ 5-స్టార్ రిసార్ట్ను అభివృద్ధి చేస్తుంది. దీనికి ప్రభుత్వం భూమిని కేటాయించడంతో పాటు ప్రోత్సాహకాలు కూడా అందిస్తుంది. ఈ ప్రాజెక్టులో రూ.150 కోట్ల పెట్టుబడితో 350 మందికి ఉద్యోగాలు వస్తాయి.
ప్రభుత్వం
శ్రీసిటీలో డైకిన్ సంస్థ ఎయిర్ కండిషనింగ్ తయారీ యూనిట్ను విస్తరించనుంది. దీని కోసం రూ.2,475 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 5,150 మందికి ఉపాధి లభిస్తుంది. సెన్సొరెమ్ ఫోటోనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(Sensorem Photonics India Private Limited) కూడా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీని ద్వారా 622 మందికి ఉద్యోగాలు వస్తాయి. క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్టీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి డెక్కన్ ఫైన్ కెమికల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, పీయూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, బ్లూ జెట్ హెల్త్కేర్ లిమిటెడ్, జూపిటర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనలకు సిఫార్సు చేసింది.ఈ ఐదు కంపెనీల ద్వారా రాష్ట్రంలో రూ.9,246 కోట్ల పెట్టుబడులు వస్తాయి. దాదాపు 7,766 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మోహన్ స్పింటెక్స్ ఇండియా లిమిటెడ్, ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు కంపెనీల ద్వారా రాష్ట్రంలో రూ.2,261 కోట్ల పెట్టుబడులు వస్తాయి. దాదాపు 2,125 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఏపీ కేబినెట్ డెక్కన్ ఫైన్ కెమికల్స్, భారత్ ఎలక్టాన్రిక్స్ లిమిటెడ్, పీయూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, బ్లూ జెట్ హెల్త్కేర్ లిమిటెడ్, జూపిటర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనలకు సిఫార్సులకు ఆమోదం తెలిపింది.
Read Also: Chandrababu Naidu : జిల్లాల పునర్విభజన హామీలపై నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశం