ఏపీలోని తూర్పు తీర ప్రాంతంలో చేపల వేట నిషేధానికి గంట మోగింది. సోమవారం అర్ధరాత్రి నుంచి 61రోజుల పాటు జూన్ 15వరకు కొనసాగనుంది. ఇందుకోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మత్స్యసంపద వృద్ధి చెందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండు నెలలపాటు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్నాయి. మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించి వేట చేస్తే కేసులు నమోదు చేస్తామని మత్స్యశాఖ అధికారులు హెచ్చరించారు.
Fisher Man: నేటి అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమలు
By
Vanipushpa
Updated: April 14, 2025 • 3:18 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.