📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

మూడు కాకపోతే ముప్పై కేసులు పెట్టుకోండి: కొడాలి నాని

Author Icon By Vanipushpa
Updated: February 18, 2025 • 3:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జగన్ సీఎంగా వున్న సమయంలో మీడియాలో తరచుగా నోరుపాడేసుకున్న మాజీ మంత్రి కొడాలి నేడు మళ్లీ మీడియాతో మాట్లాడారు. విజయవాడ సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభవనేని వంశీని పరామర్శించడా నికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చారు. ఆయన వెంట కొడాలి నాని కూడా జైలు దగ్గరకు వెళ్లారు. తనపై కేసుల అంశంపై మాట్లాడారు. తనపై మూడు కాకపోతే ముప్పై కేసులు పెట్టుకోండి.. తమకు చాలామంది లాయర్లు ఉన్నారన్నారు. లోకేష్ రెడ్ బుక్‌ని తాను చూడలేదని.. అందులో తన పేరు ఉందో లేదో తనకు తెలియదన్నారు. ఎమ్మెల్యే ఉద్యోగం పీకేశాక తాము ఇంకేమి మాట్లాడతామమని.. ఉద్యోగం పీకేసిన తర్వాత యాక్టివ్‌గా ఉండలేం కదా అన్నారు. ఇలాంటి చిన్న చిన్న కేసుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.. ఇవన్నీ సహజం అన్నారు. రెడ్ బుక్ కాదు, బ్లూ బుక్ కాదు.. ఏ బుక్‌ను పట్టించుకునేది లేదన్నారు.


జగన్ తో వచ్చిన నాని
మరోవైపు విజయవాడ సబ్ జైల్‌లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించడానికి మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు అధికారులు అనుమతి నిరాకరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట జైల్లోకి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ జగన్ వెంట జైల్లోకి వెళ్లారు. వాస్తవానికి జగన్ వెంట జైల్లోకి వెళ్లేందుకు, ములాఖత్‌లో వల్లభనేని వంశీని పరామర్శించేందుకు కొడాలి నాని, పేర్ని నాని పేర్లను వైఎస్సార్‌సీపీ నేతులు ఇచ్చారు. కానీ భద్రతాపరమైన కారణాలతో పేర్ని నాని, కొడాలి నానికి జైలు అధికారులు అనమతి ఇవ్వలేమని చెప్పారు. దీంతో కొడాలి నాాని, పేర్ని నాని మాత్రం జైలు బయటే ఉండిపోయారు.
భారీగా కార్యకర్తలు
అంతకముందు బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి జైలుకు వెళ్లారు. అక్కడ ములాఖత్ ద్వారా వంశీని కలిశారు.. ఆయనను పరామర్శించారు. విజయవాడ జైలు దగ్గర వంశీ భార్య పంకజశ్రీ కూడా ఉన్నారు. వైఎస్ జగన్ రాకతో విజయవాడ జైలు దగ్గర వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

#JaganMohanReddy #telugu News Andhra Pradesh Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu kodali nani Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Vallabhaneni Vamsi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.