Farmer Welfare : అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం

Read Time:  1 min
Farmer Welfare: అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం
Farmer Welfare: అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం
FONT SIZE
GET APP

విజయవాడ : అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య మిస్తోందని.. రైతుల క్షేమం (Farmer Welfare) సంక్షేమంతోనే వికసిత్ భారత్, స్వర్ణాంధ సాకారమవుతుందని, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక సాధి కారత సాధించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది. కార్యక్రమం మంగళవారం ఇబ్రహీం పట్నం మండలం, గుంటుపల్లిలో జరిగింది. కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ.. రైతు జి. రవీంద్రనాథ్ ఠాగూర్ (G. Rabindranath Tagore) పొలంలో వరి నాట్లు వేసి.. రైతులు అన్నివిధాలా ఎదిగేందుకు మేమంతా వారి వెనుక ఉన్నామనే భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రతి గ్రామానికీ ప్రత్యేక సమస్యలు ఉంటాయని.. ఈ నేపథ్యంలో రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే లక్ష్యంతో ప్రతి మంగళ, బుధ వారాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. సాగునీరు, విత్తనాలు, ఎరువులు, సీసీఆర్సీ కార్డులు, పంట రుణాలు ఈ క్రమాన్ని నిర్వహి స్తున్నట్లు వివరించారు. ఎక్కడా ఎరు వుల కొరత లేదని.. బయోమెట్రిక్ ఆధారిత ఆన్లైన్ విధానం ద్వారా ఎరువుల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అయితే విచ్చలవిడిగా ఎరువులు వినియోగించవద్దని, తెలిసో తెలియకో అలా వినియోగిస్తే నేల నిస్సారమై, సాగుకు పనికిరాకుండా పోతుందన్నారు. వ్యవసాయ అధికారులు, సిబ్బంది, శాస్త్రవేత్తల సూచనల మేరకు మాత్రమే ఎరువులు, పురుగుముందులు వినియోగించాలని సూచించారు. పచ్చిరొట్టతో భూసారం పెరుగుతుందని.. అదేవిధంగా ప్రకృతి సేద్య విధానాలను కూడా అనుసరించాలని సూచించారు. గుంటుపల్లిలో ప్రధానంగా బీపీటీ, పీఎల్ 1100 రకాలు పండిస్తున్నారని.. వరికి సంబంధించి మొదటి దఫా యూరియా గుళికలు వేసి తర్వాత రెండు, మూడు విడతల్లో నానో యూరియాకు ప్రాధాన్యమివ్వాలని.. దీనివల్ల దాదాపు 50 శాతం ఎరువు ఆదా అవడమే కాకుండా సామర్థ్యమూ పెరుగుతోందన్నారు. జిల్లాలో ఇప్పటికే 39 వ్యవసాయ డ్రోన్లు అందించామని, ఇక్కడ కూడా అవసరం మేరకు డ్రోన్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.

Farmer Welfare

రైతు సంక్షేమం లక్ష్యంగా హైటెక్ అగ్రికల్చర్, ప్రెసిషన్ అగ్రికల్చర్, మార్కెట్ లింక్డ్ అగ్రికల్చర్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమి స్తోందన్నారు. సాగు వరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ (91549 70454) అందుబాటులో ఉందని.. కాల్ చేసి సమాచారమిస్తే వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎలాంటి వదంతులు నమ్మొద్దన్నారు. ఎరువులను అధిక ధరలకు అమ్మినా, కృత్రిమ కొరత సృష్టించినా సంబంధీకులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/handloom-support-we-will-bear-gst-on-textiles-for-handloom-weavers-cm-chandrababu-naidu/andhra-pradesh/526639/

Shravan

రచయిత గురించి

Shravan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.