📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Visakhapatnam: చేయి విరిగిందని ఆస్పత్రికొస్తే ప్రాణాలనే మింగేసిన నకిలీ వైద్యుడు

Author Icon By Anusha
Updated: May 15, 2025 • 5:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంట్లో జారిపడి చెయ్యి విరిగిందని ఆస్పత్రికి వెళితే ఏకంగా ప్రాణాలే పోయాయి. విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని కొవ్వూరుకు చెందిన రేవతికి జనార్దన్‌తో వివాహమైంది. ఆయన చిప్పాడ దివీస్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వారికి నాలుగేళ్లు, తొమ్మిది నెలల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు.అయితే జనార్దన్(Janardhan) ఉద్యోగ నిమిత్తం ఈ కుటుంబం మొత్తం విశాఖపట్నం తగరపువలస సమీపంలోని జీరుపేటలో నివాసం ఉంటున్నారు. ఆమె ఈనెల 6న బాత్‌రూంలో కాలు జారి పడిపోయారు. ఆమె కుడి చేయి విరగడంతో కుటుంబసభ్యులు సంగివలసలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు సర్జరీ చేసేందుకు బీమా (ఇన్స్యూరెన్స్) అనుమతులు రావాలని డాక్టర్లు చెప్పారు. అనుమతులు వచ్చాక సర్జరీ చేస్తామని తెలిపారు.ఈనెల 8న సాయంత్రానికి అనుమతి రావడంతో ఈ 9వ తేదీ ఉదయం సర్జరీకి ఏర్పాట్లు చేశారు.

ఆందోళన

రేవతికి సర్జరీకి ముందు నొప్పి తెలియకుండా డాక్టర్లు మత్తు మందు ఇచ్చారు. అయితే ఈ క్రమంలో ఆ మత్తుమందు డోసు ఎక్కువ కావడంతో ఆమె కోమాలోకి వెళ్లింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమె భర్త జనార్దన్ ఆందోళన వ్యక్తం చేశారు. రేవతిని మెరుగైన వైద్యం కోసం ఆ ఆస్పత్రి నుంచినగరంలోని వేరే ఆసుపత్రిలో ఈనెల 10న చేర్పించారు. అయితే రేవతి పరిస్థితి రోజురోజుకీ విషమించడంతో బుధవారం మధ్యాహ్నం ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం కేజీహెచ్‌(KGH)కు తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే రేవతి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.తమకు న్యాయం జరిగే వరకూ పోస్ట్‌మార్టమ్‌(Postmortem)కు సహకరించేది లేదని మృతురాలి కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.వారంతా ఆ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.వారు మాత్రం ఆందోళన విరమించలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: Andhra Pradesh: ఆంధ్రాలో పేదలకు ఇళ్ల స్థలాలు

#AccidentTragedy #AndhraNews #HospitalNegligence #Visakhapatnam #WomanDies Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.