విజయవాడ Employees Issues : రాష్ట్రంలో పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ ఉద్యోగులు (Various government employees) ఫెన్సనర్ల సమస్యల సానుకూల పరిష్కారానికి అవసరమైన ప్రయత్నం చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu) వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈసమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉద్యోగులకు సంబంధించి పెండిగ్ డిఏలు, పిఆర్సి బకాయిలు, ఆర్జిత సెలవుల నగదు చెల్లింపు బాకాయిలు తదితర అంశాలను సిఎస్ దృష్టికి తెచ్చారు. అనంతరం సిఎస్ మాట్లాడుతు ఈప్రభుత్వం వచ్చాక మొదటి సారి జరిగిన ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (Joint Staff Council) సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపిన అన్ని అంశాలను నమోదు చేయడం జరిగిందని వాటన్నిటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి సకాలంలో పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందని సిఎస్ విజయానంద్ ఉద్యోగ సంఘాలకు చెప్పారు.
ఉన్నతాధికారులు – ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమీక్షా సమావేశం
సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి,టిఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, పిఆర్ అండ్ ఆర్డి ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్థిక, ప్రణాళికా శాఖల ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్, విద్యాశాఖ కార్యదర్శి కె.శశిధర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు, కళాశాల విద్యా డైరెక్టర్ భరత్ గుప్త, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి గౌతమ్ అల్లాడ తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే ఉద్యోగ సంఘాల నుండి ఎపి ఎన్జిజిజిఓ అధ్యక్షులు విద్యాసాగర్, ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ మోహన్, రాష్ట్ర టీచర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ ఉన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :