Duddilla Sripada Rao: సోమవారం కలెక్టరేట్లో స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు 87 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా పనిచేసిన శ్రీపాదరావు ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో విశిష్ట పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆయన సేవలు, ప్రజా సేవ పట్ల నిబద్ధత భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్, ఆర్డీఓ వెంకటేష్, డీపీఆర్ఓ రఫిక్, ఏఓ రాజ్కుమార్, తహసిల్దార్ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: Ibrahimpatnam: మాపైనే వార్తా రాస్తావా..రిపోర్టర్ కి ఎంపీఓ ఉషాకిరణ్ బెదిరింపులు

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: