📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Drugs: విజయవాడ బైక్ లో పట్టుబడ్డ డ్రగ్స్

Author Icon By Anusha
Updated: June 6, 2025 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడలోని రామవరప్పాడు రింగ్‌ రోడ్‌ సమీపంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. 33 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ కాగా, వారి నుండి సెల్ ఫోన్లు, వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఢిల్లీ(Delhi)కి చెందిన రింకు నుండి డ్రగ్స్ కొరియర్ల ద్వారా దిగుమతి చేసుకున్నట్లు విచారణలో తేలింది.

పూర్తి వివరాలు

రామవరప్పాడు ఫ్లై ఓవర్ వైపు నుండి విజయవాడ వైపు అనుమానాస్పదంగా వెళుతున్న రెండు వాహనాలను తనిఖీ చేశారు. ఓ ఇనుప పెట్టెలో వైట్ కలర్ క్రిస్టల్ MDMA డ్రగ్స్ ప్యాకెట్లు రెండు, పర్పుల్ కలర్ క్రిస్టల్ ఎండీఎంఏ డ్రగ్స్ ప్యాకెట్ ఒకటి, రెడ్ కలర్ క్రిస్టల్ ఎండీఎంఏ అడ్రస్ ప్యాకెట్ ఒకటి మొత్తం సుమారు 33 గ్రాముల డ్రగ్స్ లభించాయి. రెండు బైకులతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.నూజివీడుకు చెందిన మనోహర్ ద్వారా ఢిల్లీకి చెందిన రింకు నుండి ట్రాక్ ఆన్, డీటీడీసీ కొరియర్ల ద్వారా దిగుమతి చేసుకున్నట్లు విచారణలో తెలిసింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిలో సనత్ నగర్ కు చెందిన తిరుమలశెట్టి జీవన్ కుమార్, టీచర్స్ కాలనీకి చెందిన బొంతు నితీశ్ కుమార్, యనమలకుదురుకు చెందిన తరుణ్ ప్రసాద్‌లు ఉన్నారు.

Drugs

ప్రయత్నిస్తున్నారు

వీరు గతంలో కూడా చిన్నపాటి మత్తు పదార్థాల కేసుల్లో చిక్కుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈసారి వీరు పెద్ద మొత్తంలో డ్రగ్స్‌(Drugs)ను తెచ్చి విద్యార్థులకు, యువతకు అమ్మాలనే ఆలోచనతో విజయవాడకు వచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి,దర్యాప్తు చేపట్టారు.నిందితుల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని, ఇంకా ఎవరెవరితో ఈ ముఠాకు సంబంధాలు ఉన్నాయో గుట్టు రట్టు చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీలోని రింకు అనే డ్రగ్ డీలర్‌ను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Read Also: Vijayawada: శృతిమించిన ఐపీఎల్ అభిమానం.. ఓ ప్రాణం పోయింది

#drugbust #MDMABust #VijayawadaCrime #VijayawadaNews Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.