ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఓ హోంగార్డు తన భార్యను దారుణంగా హింసిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ అని నమ్మించి పెళ్లి చేసుకున్న నిందితుడు ఆ తర్వాత తన నిజస్వరూపం బయటపెట్టడమే కాకుండా అశ్లీల వీడియోలు చూపిస్తూ శారీరకంగా చిత్రహింసలకు గురిచేశాడు. అతడి వేధింపులు భరించలేని బాధితురాలు తల్లితో కలిసి నిన్న గుంటూరు(Guntur) పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక విచారణకు ఆదేశాలు జారీ చేశారు.పూర్తి వివరాలు,పాత గుంటూరుకు చెందిన యువతి బీఎస్సీ చదివారు ఆమెకు 8 నెలల కిందట అలీనగర్(Alinagar)కు చెందిన హోంగార్డుతో పెద్దలు వివాహం జరిపించారు. పెళ్లికి ముందు తాను కానిస్టేబుల్ అని చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు. పెళ్లయ్యాక అతను హోంగార్డు అని తెలిసిందని,కొన్ని రోజులకు ఫణీంద్రకుమార్ మరో మహిళతో ఉన్న ఫోటో ఒకటి బాధితురాలి కంటపడింది. ఆ ఫోటో గురించి ఆరా తీస్తే తన భర్త మూడేళ్ల క్రితం పొత్తూరుకు చెందిన ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడని తెలిసిందన్నారు. ఈ విషయం దాచిపెట్టి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

విచారణ
ఈ మోసం గురించి నిలదీయడంతో తనపై దాడికి పాల్పడ్డాడని, దుర్భాషలాడుతూ చిత్రహింసలకు గురిచేశాడని కన్నీళ్లు పెట్టింది. అశ్లీల వీడియోలు చూపిస్తూ తీవ్రంగా హింసించేవాడని, కొన్నిసార్లు రక్తం వచ్చేలా గాయపరిచి, మూత్రం కూడా తాగించాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అతను ఇంట్లో లేని సమయంలో మామగారు అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆ బాధలు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయాను. నా భర్తపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయండి’ అంటూ ఆమె పోలీసులను కోరింది. ఈ వేధింపుల వ్యవహారంపై పోలీసు అధికారులుప్రత్యేక విచారణకు ఆదేశించారు. భార్య ఆరోపణలపై హోంగార్డు స్పందించాల్సి ఉంది.
Read Also : Kandula Durgesh : జూన్ లో గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన