📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Assembly :అసెంబ్లీ కి రాని ఎమ్మెల్యే ల పై రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు ఆగ్రహం

Author Icon By Anusha
Updated: March 21, 2025 • 12:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా జీతం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయం పై మాట్లాడారు.

వైసీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు విమర్శలు

అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చించేందుకు, పాలనలో పారదర్శకత తీసుకురావడానికే ఏర్పాటు చేయబడతాయి.అయితే, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా, కేవలం హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేసుకుని వెళ్లిపోవడం ప్రజాస్వామ్యానికి తగదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. “వైసీపీ సభ్యులు కొంత మంది అసెంబ్లీలో కనిపించకుండా రిజిస్టర్‌లో మాత్రం సంతకాలు చేశారు,అని చంద్రబాబు తెలిపారు.గవర్నర్ ప్రసంగం తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు రాకపోవడం ప్రజల పక్షాన పని చేయకపోవడమే అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.ధైర్యంగా సభకు రాలేరా? దొంగల్లా వచ్చి సంతకాలు చేయడం ఎందుకు,అని ఆయన వైసీపీ సభ్యులను ప్రశ్నించారు.

కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకుండా, ప్రజల సొమ్ముతో జీతం తీసుకోవడం తగదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ 57 లక్షల జీతం తీసుకుని అసెంబ్లీకి రావడం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని విమర్శించారు.ప్రజల సొమ్ము జీతంగా పొందుతున్న కేసీఆర్ అసెంబ్లీకి సమావేశాలకు వచ్చి తెలంగాణ అభివృద్ధికి సలహాలు ఇవ్వకుండా హౌస్‌లో ఉండిపోవడం సమంజసమా అని రేవంత్ ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేల హాజరు అవసరమే

ఎమ్మెల్యేలు ప్రజల సేవకులు.ప్రజల కష్టాలు పరిష్కరించడానికి, పాలనలో చురుకుగా పాల్గొనడానికి అసెంబ్లీలో హాజరు కావాల్సిందే.ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకోవడమేంటని రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వైసీపీ, బీఆర్ఎస్ సభ్యులు భవిష్యత్‌లోనైనా ఈ తీరును మార్చుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.

ప్రజా ప్రతినిధుల బాధ్యత

ప్రజా ప్రతినిధులంటే ప్రజా సేవకులు వారుకూడా ఒకవిధంగా ప్రభుత్వ ఉద్యోగులే ప్రజలు కట్టే పన్నుల నుంచి ప్రతి నెలా జీత భత్యాలు తీసుకునే వారు ఎన్నుకున్న ప్రజల కోసం అసెంబ్లీ సమావేశాలకి రాకపోతే ఎలా,ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం తప్పనిసరి. ప్రజల కట్టే పన్నుల నుంచే వీరు జీతం తీసుకుంటారు, అందుకే సభకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలి.

#AccountabilityInPolitics #AssemblyAttendance #ChandrababuVsYCP #DemocracyMatters #MLADuties #MLASalaryDebate #PoliticalEthics #PublicRepresentatives #RevanthReddyVsKCR #TaxPayersMoney Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.