Tirumala Laddu Issue: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఆదివారం తిరుపతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కల్తీ జరిగిందని తాను చేసిన వ్యాఖ్యలు రాజకీయ విమర్శలు కావని, అవి జాతీయ స్థాయి సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసిన వెల్లడి అని స్పష్టం చేశారు.
Read Also:Ambati Rambabu : అంబటి వ్యాఖ్యల పై తిరుపతి లో పిర్యాదులు
ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- నివేదిక ఆధారంగానే వ్యాఖ్యలు: “టీటీడీ ఈవో శ్యామలరావు గారు నెయ్యి నమూనాలను NDDB-CALF ల్యాబ్కు పంపారు. ఆ నివేదికలో జంతువుల కొవ్వు (Animal Fat) కలిసే అవకాశం ఉందని స్పష్టంగా వచ్చింది. ఆ రిపోర్టు ఆధారంగానే నేను భక్తులకు నిజం చెప్పాను. దీనిపై నన్ను క్షమాపణలు అడగడం హాస్యాస్పదం.” అని సీఎం పేర్కొన్నారు.
- సిట్ విచారణ & కుట్రలు: ఈ అపచారంపై ప్రభుత్వం Special Investigation Team (SIT) ఏర్పాటు చేసిందని, దర్యాప్తులో వ్యవస్థీకృత అవినీతి బయటపడిందని తెలిపారు. సిట్ చార్జిషీట్లో 36 మందిని నిందితులుగా చేర్చినట్లు గుర్తుచేశారు.

- ప్రక్షాళన దిశగా అడుగులు: తిరుమల(Tirumala Laddu Issue) పవిత్రతను కాపాడేందుకు తాను కట్టుబడి ఉన్నానని, అందుకే సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించి టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించామని చెప్పారు.
- ఎదురుదాడిపై మండిపాటు: “మహాపాపం చేసి, శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారు పశ్చాత్తాపం చెందాల్సింది పోయి.. తిరిగి నాపైనే దాడి చేస్తున్నారు. స్వామివారితో రాజకీయం చేసే వారిని ఆ భగవంతుడే చూసుకుంటాడు.” అని హెచ్చరించారు.
- సామాన్య భక్తుడిగానే దర్శనం: ప్రోటోకాల్ ప్రకారం మహాద్వారం ద్వారా వెళ్లే అవకాశం ఉన్నా, తాను ఎప్పుడూ సామాన్య భక్తుడిగానే క్యూలైన్లలో వెళ్లి స్వామిని దర్శించుకుంటానని, ఆ పవిత్రత తన కుటుంబానికి దైవసమానమని వివరించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: