News telugu: Chiranjeevi-చిరంజీవిని ఎవరూ అవమానించలేదు: ఆర్.నారాయణమూర్తి

Read Time:  1 min
News telugu
News telugu
FONT SIZE
GET APP

ఏపీ అసెంబ్లీలో జరిగిన కొన్ని వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించిన తీరు సరైనదేనని ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి (R. Narayana Murthy)స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు చిరంజీవి చేసిన సేవలను గుర్తు చేస్తూ, ఆయనను అవమానించారన్న వాదనలను ఖండించారు.

“చిరంజీవిని ఎవరూ అవమానించలేదు”

నారాయణమూర్తి మాట్లాడుతూ, ఇటీవల ఎపి అసెంబ్లీ(AP assembly)లో చిరంజీవి గారిపై వచ్చిన వ్యాఖ్యల పట్ల ఆయన స్పందించిన తీరును పూర్తిగా సమర్థించారు. “ఆయన స్పందన నూటికి నూరు శాతం సరిగ్గానే ఉంది. అసలు ఆయనను ఎవరూ అవమానించలేదు,” అని స్పష్టం చేశారు.

జగన్‌తో భేటీ గుర్తు చేసిన నారాయణమూర్తి

నారాయణమూర్తి గతంలో జరిగిన ఓ కీలక సంఘటనను గుర్తు చేశారు. కరోనా సమయంలో సినీ పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో, చిరంజీవి గారే ముందుకు వచ్చి ఆ సమస్యలపై వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో భేటీ ఏర్పాటుకు కృషి చేశారంటూ చెప్పారు.”ఆ సమయంలో చిరంజీవి ఫోన్ చేసి నన్ను కూడా ఆ భేటీకి ఆహ్వానించారు. చిన్న సినిమాలు నిలదొక్కుకోవాలనే తపన ఆయనలో కనిపించింది,” అని ఆయన తెలిపారు.

“జగన్ గారు గౌరవంతో వ్యవహరించారు”

ఆ సమావేశంలో జగన్ ఎలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయలేదని, చిరంజీవిని ఎంతో గౌరవంతో పలకరించారని నారాయణమూర్తి పేర్కొన్నారు. “జగన్ గారు మా సమస్యలపై గంభీరంగా స్పందించారు. పరిశ్రమకు సహాయంగా ఉండే హామీ ఇచ్చారు,” అని గుర్తు చేశారు.

ఇప్పటికీ పలు సమస్యలు పరిష్కారంలోలేవన్న ఆవేదన

అయితే, ఆ భేటీ తర్వాత కూడా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారానికి రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఈ అంశంపై దృష్టి సారించాలని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.