📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Chegondi Harirama Jogaiah :చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు లేఖ రాసిన హరిరామజోగయ్య

Author Icon By Anusha
Updated: March 15, 2025 • 3:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ రాజకీయాల్లో బహిరంగ లేఖల ప్రస్థావన వస్తే ముందుగా గుర్తుకు వచ్చే పేరు చేగొండి హరిరామజోగయ్య అని చెప్పినా అతిశయోక్తి కాదేమో.2024 ఎన్నికలకు ముందు నుంచీ ఆయన వరుసగా లేఖలు రాస్తూనే ఉన్నారు. తొలుత టీడీపీతో జనసేన పొత్తు, ఆ సమయంలో పవన్ డిమాండ్ చేయాల్సిన సీట్ల సంఖ్య వరకూ ఆయన తన లేఖల్లో సూచించేవారు.ఇక ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జోగయ్య ఓ లేఖ రాశారు.ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి తర్వాత ఆ లేఖ విడుదల చేశారు. అందులో ప్రధానంగా కాపు రిజర్వేషన్స్ గురించి ప్రస్తావించారు.

బహిరంగ లేఖ

కాపు సంక్షేమ అధ్యక్షుడు హరిరామజోగయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్ర అభివృద్ధి, ప్రత్యేకంగా ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధి అంశాలను ప్రస్తావించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రాజధాని నిర్మాణం పేరిట ఇప్పటికే రూ. 50,000 కోట్లు ఖర్చు చేశారని, ఇంకా మరో రూ. 50,000 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారని లేఖలో ఆయన తెలిపారు.పరిపాలన సౌలభ్యం కోసం శాసనసభ, శాసనమండలి, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాలకు ఖర్చు చేయడం సరైనదే అయినా, మిగతా జిల్లాల అభివృద్ధి కూడా సమానంగా జరగాలని హరిరామజోగయ్య అభిప్రాయపడ్డారు.

ఉభయగోదావరి జిల్లాలను దత్తత 

వారాహి సభలో ఉభయ గోదావరి జిల్లాలను దత్తత తీసుకుంటానని పవన్ చెప్పారని. ఈ సందర్భంగా ఈ రెండు జిల్లాల్లోనూ అభివృద్ధికి ఏ విధమైన సౌకర్యాలు కల్పించారో చెప్పాల్సిన అవసరం ఉందని లేఖలో కోరారు జోగయ్య. ఇందులో భాగంగా విద్య, వైద్యం, రోడ్లు, వ్యాపారం, వ్యవసాయం, సాగు నీరు, తాగు నీరు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వల్సిన అవసరం ఉందని అన్నారు.

ఏళ్ల తరబడి సమగ్ర అభివృద్ధికి నోచుకోని ఉభయ గోదావరి జిల్లాలకు కూటమి ప్రభుత్వం ఏయే పథకాలకు ఎంతెంత ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని జోగయ్య డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాకు ప్రతి ఏడాది ఎంత ఖర్చు చేశారనే దానిపై శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రజలు సంతోషిస్తారని సూచించారు.

#Amaravati #AndhraPradesh #APPolitics #CapitalExpenditure #ChandrababuNaidu #GodavariDevelopment #HariramaJogayya #OpenLetter #PawanKalyan #PoliticalAccountability #PublicWelfare #Transparency Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.