📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ఆంధ్రాలోనూ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు-భువనేశ్వరిని ప్రశంసించిన చంద్రబాబు

Author Icon By Vanipushpa
Updated: March 6, 2025 • 3:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నారా భువనేశ్వరి నేతృత్వంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ విజయవాడ కేంద్రంగా తన సేవలను మరింత విస్తరించనుంది. ఈ క్రమంలో నేడు విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ట్రస్ట్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఇది మరో మైలురాయి అని నారా భువనేశ్వరి అభివర్ణించారు.

సొంత భవన నిర్మాణానికి శంకుస్థాపన దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. పేదలకు, అభాగ్యులకు సాయం అందించే మహోన్నత లక్ష్యంతో పనిచేస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ నేడు విజయవాడలో సొంత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్న వేళ నారా భువనేశ్వరిని, ట్రస్ట్ నిర్వాహకులను అభినందిస్తున్నానని తెలిపారు. “28 ఏళ్ల కిందట స్థాపించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కోట్లాది మందిని విపత్కర పరిస్థితుల్లో ఆదుకుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడమే కాకుండా, బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో ప్రాణాలను నిలబెడుతున్న ఎన్టీఆర్ ట్రస్ట్… సేవా కార్యక్రమాలు చేసేవారికి స్ఫూర్తినిస్తోంది. తలసేమియా బాధిత పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఎన్టీఆర్ ట్రస్ట్ తన సేవలను విస్తరించే క్రమంలో జరిగిన నేటి నూతన భవన శంకుస్థాపన సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజ్ మెంట్ కు, సిబ్బందికి, దాతలకు అభినందనలు తెలుపుకుంటున్నాను” అని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.

#telugu News Andhra Pradesh Ap News in Telugu Breaking News in Telugu Chandrababu Naidu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.