ఆంధ్రప్రదేశ్లో సముద్రతీరాన్ని సంపూర్ణంగా వినియోగించుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక అడుగులు వేస్తున్నారు. రాష్ట్రానికి ఉన్న 1000 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం పెద్ద ఆస్తిగా మారనుంది. పోర్టుల ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ఇది బలమైన పునాదిగా నిలుస్తుందని Chandrababu Naidu తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నేడు సచివాలయంలో సముద్ర తీర ప్రాంత అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ శాఖ కార్యదర్శి టీ.కె. రామచంద్రన్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ లక్ష్యం
సముద్రతీరాన్ని వ్యవస్థాపితంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో, ప్రతి 50 కి.మీ దూరంలో ఓ పోర్ట్ లేదా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ప్రతిపాదించిన దుగరాజపట్నం పోర్ట్ను ఇప్పుడు తిరుపతి జిల్లా పరిధిలో నిర్మించేందుకు ముందడుగు వేస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ కేవలం పోర్ట్గా మాత్రమే కాకుండా, షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ క్లస్టర్గా మారనుంది. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తున్న ఈ ప్రాజెక్టుకు రూ.3,500 కోట్లతో 2000 ఎకరాల్లో శిలాఫలకం వేయనున్నారు.
షిప్ బిల్డింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్
ఈ క్లస్టర్లో 4 డ్రైడాక్లు, అవుట్ఫిటింగ్ జెట్టీలు, షిప్ లిఫ్ట్ వంటి ఆధునిక సదుపాయాలు ఉంటాయి. నౌకా నిర్మాణానికి 1000 ఎకరాలు, అనుబంధ పరిశ్రమల కోసం మరో 1000 ఎకరాలు అవసరం అవుతుందని అధికారులు వెల్లడించారు. కేంద్రం పెట్టుబడి చేస్తే, రాష్ట్రం భూసేకరణ చేపడుతుంది.ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు ₹26,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించవచ్చని అంచనా. ఇది 5,000 మందికి ప్రత్యక్షంగా, మరో 30,000 మందికి పరోక్షంగా ఉపాధిని కల్పిస్తుంది. దీనిపై అధికారులు కార్యాచరణ రూపకల్పనను వెంటనే ప్రారంభించాలని సీఎం సూచించారు.
విశాఖ పోర్ట్ – ప్రధాన గేట్వే
విశాఖ పోర్టును సరుకుల రవాణాకు తక్కువ ఖర్చుతో వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఇది రాష్ట్రంలో దిగుమతి-ఎగుమతి వృద్ధికి బలమవుతుంది. పోర్ట్ ఆధారిత కార్మికులకు, లాజిస్టిక్ పరిశ్రమకు ఇది కొత్త అవకాశాలు తీసుకురానుంది.ఈ సమావేశంలో మరో ఆసక్తికర అంశం చర్చకు వచ్చింది. రాష్ట్రంలోని నీటి మార్గాలను ఉపయోగించి రివర్ క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి సీఎం ప్రణాళికలు పంచుకున్నారు. పోలవరం, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో క్రూయిజ్ సర్క్యూట్లు ఏర్పాటు చేసే అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
Read Also : Andhra Pradesh: ఏపీలో ఉపాధి హామీ అవకతవకలతో పలు మార్పులు