ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద శుభవార్త చెప్పారు. ప్రతి అర్హుడైన డ్రైవర్కు రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు అసెంబ్లీ(Assembly)లో అధికారికంగా ప్రకటించారు.

అక్టోబర్ 4న డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకి
ఈ ఆర్థిక సహాయం వచ్చే నెల అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయబడుతుందని సీఎం స్పష్టం చేశారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.9 లక్షల డ్రైవర్లు లాభపడేలా ఉంటుంది.
‘సూపర్ సిక్స్’ పథకాల్లో భాగంగా కీలక ప్రకటన
ఈ నిర్ణయం నేడు జరిగిన శాసనసభ సమావేశాల్లో ‘సూపర్ సిక్స్’ (Super Six)పథకాలు మరియు ఎన్డీయే మేనిఫెస్టో హామీల అమలుపై జరిగిన చర్చలో భాగంగా వెలువడింది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వానికి పూర్తి కట్టుబాటు ఉందని, అర్హులందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు.
లబ్ధిదారుల వివరాలు & ఖర్చు లెక్కలు
ఈ పథకానికి మొత్తం 2,90,234 మంది డ్రైవర్లు అర్హులు అని ప్రభుత్వం గుర్తించింది. వారందరికీ ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రతివార్షికంగా రూ.435 కోట్లు ఖర్చు చేయనుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే, ఇప్పుడు అందే సహాయం రూ.12,000 నుండి రూ.15,000కి పెరిగింది.
పేర్ల లిస్టులో లేనివారికి అవకాశం
ఏవైనా కారణాల వల్ల అర్హులైనవారి పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే, వారు సంబంధిత సమస్యలు క్లియర్ చేసుకున్న వెంటనే వారినీ జాబితాలో చేర్చుతామని సీఎం భరోసా ఇచ్చారు. సహాయం అందకుండా మిగిలే అవకాశం ఉండదని పేర్కొన్నారు.
చలాన్లు, ఫిట్నెస్ సమస్యల పరిష్కారానికి సూచనలు
ఇంకా ముఖ్యంగా, పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు లేదా ఫిట్నెస్ సర్టిఫికెట్ సమస్యలతో బాధపడుతున్న డ్రైవర్లు వాటిని తొలగించుకున్న తర్వాత కూడా ఈ పథకం ద్వారా సహాయం పొందవచ్చని సీఎం వెల్లడించారు.ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటుండటం పట్ల సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: