📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ఏపీ యువతకు చంద్రబాబు శుభవార్త

Author Icon By Vanipushpa
Updated: February 12, 2025 • 1:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దాదాపు రెండు దశాబ్ధాల కిందట ఐటీ రంగం ప్రాముఖ్యతను దేశంలో ముందుగా గ్రహించి అమెరికా దిగ్గజ కంపెనీల సీఈవోలను కూడా హైదరాబాదుకు తీసుకొచ్చిన వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు. అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో దానికి మించిన వృద్ధిని సాధించటానికి కొత్త ఆలోచనతో వున్నారు. ఇప్పటికే దేశంలో ఐటీ నుంచి స్టార్టప్స్ వరకు వివిధ రంగాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలతో పోటీలో తగ్గేదేలే అని సీఎం చంద్రబాబు కొత్త ఆలోచనతో వచ్చారు. ఏపీలో మహిళా నిపుణులను సాధికారపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు ఇందులో భాగంగా వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగ అవకాశాలను పెంచాలని నిర్ణయించారు.
మహిళల భాగస్వామ్యాన్నిపెంచేందుకు కృషి
వాస్తవానికి కరోనా సమయంలో అనేక ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సౌలభ్యాన్ని అందించిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత ఖచ్చితంగా ఆఫీసులకు రావాల్సిందేనని చెప్పటంతో చాలా మంది మహిళలు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కారణం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సమస్యలేనని తేలింది. అయితే ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని తిరిగి పెంచేందుకు ఏపీ సీఎం ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ వంటి రంగాల్లో వీరి భాగస్వామ్యాన్ని పెంచాలని భావిస్తున్నారు.


యువతకు అందుబాటులోకి ..
దీనికి ముందు సైతం గతంలో సీఎం చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వర్క్ ఫ్రమ్ హోం ఆపర్చునిటీలను ఆంధ్రప్రదేశ్ యువతకు అందుబాటులోకి తీసుకురావటానికి తాము కృషి చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. వాస్తవానికి ఇదొక వినూత్న ఆలోచన. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ ఆలోచనతో ముందుకు రాలేదు. ప్రపంచానికి ఏపీ నుంచి రిమోట్ వర్క్ ఫోర్స్ సప్లై చేయటం ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలను అందిస్తుందన్నారు.
కొత్త ఆర్థిక వ్యవస్థకు నాంది
ఇదే సమయంలో చంద్రబాబు ఏపీ ఐటీ, జీసీసీ పాలసీ 4.0ను తీసుకొచ్చారు. వీటి ద్వారా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉపయోగించుకుంటూ పెద్ద అడుగులు వేయాలని నాయుడు ప్లాన్ చేస్తున్నారు. వీటి ద్వారా ఏపీలో ఐటీ పరిశ్రమతో పాటు జీసీసీల ఏర్పాటుతో కొత్త ఆర్థిక వ్యవస్థకు నాంది పలకాలని ఆయన చూస్తున్నారు.

#telugu News Andhra Pradesh Ap News in Telugu Breaking News in Telugu Chandrababu good news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.