📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Tirupati Pakala : తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులకు కేంద్ర ఆమోదం

Author Icon By sumalatha chinthakayala
Updated: April 9, 2025 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirupati Pakala : తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్‌ పనులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. రూ.1332 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులతో 35 లక్షల పనిదినాలు కల్పించే అవకాశం ఉందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ పనుల ద్వారా 400 గ్రామాల్లోని 14 లక్షల మంది జనాభా లబ్ధి పొందుతారని చెప్పారు. మరోవైపు పర్యాటకంగా ఎంతో అభివృద్ధి జరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. లక్షల సంఖ్యలో సందర్శకులు వస్తారని పేర్కొన్నారు. ఈ డబ్లింగ్‌ ప్రాంతంలోనే తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట ఉన్నాయని ఆయన వివరించారు.

ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాకు లబ్ధి

అదేవిధంగా తిరుపతి, వెల్లూరు ప్రాంతాలు వైద్య, విద్య హబ్‌లుగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ రీజియన్‌కు లబ్ధి చేకూరుతుంది. ఎలక్ట్రానిక్స్‌, సిమెంట్‌, స్టీల్‌ తయారీ కంపెనీలు లబ్ధి పొందనున్నాయి. ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాకు లబ్ధి చేకూరుతుంది. ఇందులో భాగంగా 17 మేజర్‌, 327 మైనర్‌ వంతెనలు వస్తున్నాయి. అదేవిధంగా 7 పైవంతెనలు, 30 అండర్‌ పాస్‌ బ్రిడ్జ్‌లు రానున్నాయని’ అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. తద్వారా 104 కిలోమీటర్ల మార్గం రోడ్డుకు బదులు రైలు మార్గానికి రద్దీ మళ్లుతుందని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. 20 కోట్ల కిలోల కార్బన్‌డయాక్సైడ్‌ తగ్గుతుందన్నారు. అదేవిధంగా 4 కోట్ల లీటర్ల డీజిల్‌ పొదుపు అవుతుందని చెప్పారు. ఏడాదికి 4 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు అవకాశం ఉంటుందని తెలిపారు.

Read Also: అమరావతిలో ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన చంద్రబాబు

Breaking News in Telugu Central Government Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Tirupati-Pakala-Katpadi doubling works Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.