APPSC : గ్రూప్-1 అధికారులకు సుప్రీంకోర్టులో నిరాశ

Read Time:  1 min
APPSC : గ్రూప్-1 అధికారులకు సుప్రీంకోర్టులో నిరాశ
FONT SIZE
GET APP

APPSC: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 2018 బ్యాచ్ గ్రూప్-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తమను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలంటూ ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

Read Also:APPSC : గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టులో విచారణ

APPSC: Group-1 officers disappointed in Supreme Court

డివిజన్ బెంచ్ ఉత్తర్వులు చట్టపరంగా సరైనవేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పరిపాలనా అవసరాల మేరకు అధికారులను ఎక్కడైనా నియమించవచ్చని పేర్కొంది. ప్రాధాన్య హోదాలు లేకపోతే విధులు నిర్వహించరా? ఎక్కడ పనిచేసినా వేతనం అందుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అందుబాటులో ఉన్న బాధ్యతలను స్వీకరించి సంతృప్తిగా పనిచేయాలని సూచించింది.

పరిపాలనా స్వేచ్ఛకు మద్దతు

ఈ తీర్పు ద్వారా ప్రభుత్వానికి ఉన్న బదిలీ అధికారాలపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చినట్లైంది. పరిపాలనా నిర్ణయాల్లో కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోవని మరోసారి వెల్లడైంది. దీంతో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు యథాతథంగా అమల్లో కొనసాగనున్నాయి. ఈ పరిణామం రాష్ట్ర పరిపాలనలో కీలక చర్చకు దారితీసే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.