AP: రాజమండ్రిలో కల్తీ పాల సరఫరా కారణంగా చోటుచేసుకున్న విషాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్రంగా స్పందించారు. విషపు పాలు తాగి కేవలం రెండు రోజుల వ్యవధిలోనే నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆమె పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల కల్తీ వల్ల సామాన్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నీ సమస్యతో పరిస్థితి విషమించి 8 మంది ఆసుపత్రుల్లో చేరడం ఆందోళనకరమన్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
Read Also: AP Inter exams: ఇంటర్ పరీక్ష కేంద్రాల ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని షర్మిల డిమాండ్ చేశారు. బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి. కల్తీ పాల సరఫరా వెనుక ఉన్న అసలు మూలాలను గుర్తించేందుకు తక్షణమే విచారణ చేపట్టాలి. దీనిపై ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: