AP : వై ఎస్ జగన్ కు మోదీ ఫోన్ .. ఎందుకంటే..

Read Time:  1 min
AP
AP
FONT SIZE
GET APP

AP : మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు (AP) మద్దతివ్వాలని ఆయన కోరారు. ప్రధాని మోదీ సూచన మేరకే ఈ కాల్ చేసినట్లు సమాచారం.

వైసీపీ పాత్ర కీలకం

లోక్‌సభలో వైసీపీకి 4 ఎంపీలు, రాజ్యసభలో 7 మంది సభ్యులు ఉన్నారు.
అందువల్ల వైసీపీ నిర్ణయం కీలకంగా మారింది. ఎన్డీఏ సూచించిన రాజ్యాంగబద్ధమైన పదవులకు గతంలో కూడా వైసీపీ మద్దతు ఇచ్చింది. అందువల్ల ఇప్పుడు జగన్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

ఉపరాష్ట్రపతి ఎన్నిక వివరాలు NDA అభ్యర్థి రాధాకృష్ణన్

సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. అదే రోజున కౌంటింగ్ జరుగుతుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీ.పీ. రాధాకృష్ణన్‌ను ప్రకటించింది. ఆయన తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు. గతంలో కోయంబత్తూరు నుండి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. అలాగే ఝార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా కూడా పనిచేశారు.

ప్రతిపక్షం నిర్ణయం ఆసక్తికరం

NDA అభ్యర్థి పేరును ప్రకటించిన తర్వాత ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రతిపక్షం ఎంపిక వారు మద్దతు ఇవ్వాలా లేదా కొత్త అభ్యర్థిని పోటీలో నిలబెట్టాలా అనే అంశంపై ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం NDAకు పార్లమెంట్‌లో మెజారిటీ ఉన్నందున రాధాకృష్ణన్ ఎన్నిక కావడం దాదాపు ఖాయమే. అయితే ప్రతిపక్షం పోటీ పెడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Read also:

https://vaartha.com/cybercriminals-are-looting-people-on-the-pretext-of-renting/crime/532044/

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.