हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

AP: వైసిపి కుట్రలను తిప్పికొట్టండి: నారా లోకేష్

Rajitha
AP: వైసిపి కుట్రలను తిప్పికొట్టండి: నారా లోకేష్

విజయవాడ : ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే ప్రభుత్వం తమది కాదని విద్య, ఐటి శాఖ మంత్రి నారాలోకేశ్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమకు అప్పగించిన బాధ్యతను నిర్వహిస్తామన్నారు. గత ప్రభుత్వ దుర్మార్గపు చర్యల గుణపాఠం చెప్పి సుపరిపాలన అందిస్తామనే ప్రజలు తమకు అధికారం ఇచ్చారన్నారు. వైఎస్సార్ సిపి మాదిరి రప్పా రప్పా మన విధానం కాదన్నారు. జగన్ లా ప్రజల్ని భయపెట్టడం, బెదిరించడం, దౌర్జన్యాలకు పాల్పడటం వంటివి తెలుగుదేశం సంస్కృతి కాదన్నారు. ఉండవల్లి సిఎం క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం మంత్రులతో నారా లోకేశ్ (Nara lokesh) అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన వారితో వివిధ అంశాలపై చర్చించారు.

Read also: Electricity Charges : విద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

Nara Lokesh

Thwart the YCP’s conspiracies: Nara Lokesh

వైఎస్సార్సీపీ అసత్య ప్రచారాలకు దీటుగా బదులివ్వాలన్నారు

ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఎంత మేర సేవ చేశామన్నదే తమ అజెండా కావాలని మంత్రులకు నారా లోకేశ్ సూచించారు. అభివృద్ధి- సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజలకు ఎంత ప్రయోజనం చేకూర్చామన్నదే కూటమి విధానమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ కుట్రలను పార్లమెంటు వారీగా నేతలు సమర్థంగా తిప్పికొట్టాలని మంత్రి లోకేశ్ పునరుద్ఘాటించారు. పార్లమెంట్ కేంద్రాల్లో నేతలు ఏకతాటిపై నడుస్తూ వైఎస్సార్సీపీ అసత్య ప్రచారాలకు దీటుగా బదులివ్వాలన్నారు. ప్రజావేదికలో తమకు వచ్చే ఫిర్యాదులు పరిష్కారమయ్యేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

క్యాడర్ ను ఏకతాటిపైకి తెచ్చేందుకు

తమ శాఖలకు సంబంధించిన అర్జీల పరిష్కారానికి మంత్రులు చొరవ చూపాలని వివరించారు. పార్టీ మరింత బలో పేతమే లక్ష్యంగా క్యాడర్ ను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇన్ఛార్జి మంత్రులు పని చేయాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. సామాజిక మాధ్యమాల్లో జవాబుదారీ తనం, పౌరుల రక్షణను బలోపేతం చేయడం అనే అంశంపై సచివాలయంలో నిర్వహించిన మంత్రుల బృంద సమావేశంలో లోకేశ్ వ్యాఖ్యానించారు. ఐటీ చట్టంలో ఇందుకు ఉన్న నిబంధనలపై చర్చించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870