ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను విస్తరించేందుకు కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పదకొండు కొత్త వైద్య కళాశాలలు నిర్మించేందుకు, నిర్వహించేందుకు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) మోడల్ను అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది వైద్య విద్యలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రయత్నం.
ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు
ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. తొలిదశలో నాలుగు ప్రాంతాల్లో — ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల — కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు.
రెండవ దశలో మరిన్ని కాలేజీలు
మిగిలిన ఆరు కళాశాలలు పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం(Amalapuram), నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం విషయంలో త్వరలోనే నిర్మాణ చర్యలు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పీపీపీ విధానం వల్ల ప్రయోజనాలు
పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ప్రాజెక్టుల అమలు వేగవంతమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నిధుల సమీకరణలో వేగం, నిర్మాణాల పూర్తి సమయంపై ప్రభావం లేకుండా ప్రాజెక్టులు ముందుకెళ్లే అవకాశముందని పేర్కొంది.
కేపీఎంజీ అధ్యయనం ఆధారంగా నిర్ణయం
ఈ నాలుగు కాలేజీల అభివృద్ధికి సంబంధించి కేపీఎంజీ అడ్వయిజరీ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన అధ్యయన నివేదికల ఆధారంగా ప్రత్యేక కమిటీ తయారు చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో వైద్య మౌలిక సదుపాయాల సంస్థ (Medical Infrastructure Corporation) తక్షణమే అవసరమైన నిర్మాణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
వైద్య విద్య విస్తరణతో పాటు ఆరోగ్య సేవలకు బలమైన మద్దతు
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వైద్య విద్యలో విద్యార్థుల అవకాశాలు పెరగడంతోపాటు, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆరోగ్య సేవల ప్రాప్త్యత మరింత మెరుగవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత సులభంగా అందే అవకాశం ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Read also: