📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP Orchard: పండ్ల తోటను ప్రోత్సహించే దిశగా రాయితీ

Author Icon By Anusha
Updated: May 23, 2025 • 6:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విత్తనాలు వేసినప్పటి నుంచి కలుపు తీయడం, నీళ్లు పెట్టడం, ఎరువులు చల్లడం, తీరా పంట చేతికి వచ్చారా సరైన గిట్టుబాటు ధర లేక రైతుులు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఆరుగాలం కష్టపడినా అంతగా ఆదాయం రాకపోవడంతో నరకం చూస్తున్నారు. కానీ ఉద్యాన పంటలు వేసిన వారు మాత్రం ఎక్కువగా పని చేయకుండానే అధికంగా లాభాలు పొందుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీ సర్కారు(AP Government) పండ్ల మొక్కల పంపిణీతో పాటు మూడేళ్ల పాటు నిర్వహణ, నీటి సరఫరా, మందులు, ఎరువలకు అయ్యే మొత్తాన్ని అందజేస్తోంది. ఇదంతా అందరికీ తెలిసిందే కాగా, తాజాగా పండ్లతోటలు పండించే రైతులకు మరో శుభవార్త చెప్పింది. ముఖ్యంగా సాగు కోసం రాయితీని భారీగా పెంచింది.పండ్ల మొక్కల రైతులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం చేస్తోంది. ఇప్పటికే పంపిణీతో పాటు నిర్వహణ, నీటి సరఫరా, మందులు, ఎరువులకు అయ్యే మొత్తాన్ని అందజేస్తోంది. అయితే మెట్ట భూముల్లో పండ్ల తోటల సాగుకు గుంటూరు జిల్లాలోని అనుకూలమైన వాతావరణం ఉన్న కారణంగా ఉద్యానశాఖ అధికారులు రైతులకు అవగహన కల్పించి మరీ దరఖాస్తులు చేయిస్తున్నారు. పండ్లతోటల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా రాయితీని కూడా పెంచింది. గత 2024-2025 సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరమైన 2025-26లో ఉద్యాన సాగుకు రాయితీ సర్కారు భారీగా పెంచింది.

ప్రభుత్వం

గతేడాది మామిడి తోటకు కేవలం ప్రభుత్వ రాయితీ రూ.13,300 ఉండగా ఈ సారి దాన్ని ఎకాఎకిన రూ.50 వేల వరకు పెంచేసింది. ఉపాధి హామీ కింద సాగు చేయాలనుకునే వారికి ప్రభుత్వం పండ్ల మొక్కలను ఇవ్వడమే కాకుండా రాయితీ నిధులను కూడా వంద శాతం వరకు మంజూరు చేస్తోంది. అయితే ఇవన్నీ పొందాలనుకుంటే ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.అసలెలా దరఖాస్తు చేసుకోవాలంటే? ఉపాధి హామీ కింద అయితే 5 ఎకరాల్లోపు సాగుభూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులు అర్హులు. గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ సంప్రదిస్తే పండ్ల తోటల సాగుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసి మరీ దరఖాస్తు చేయిస్తారు.

Orchard: పండ్ల తోటను ప్రోత్సహించే దిశగా రాయితీ

దరఖాస్తు

అయితే ఈ విషయాలను నేరుగా ఉద్యానశాఖ జిల్లా అధికారి రమణారెడ్డి తెలిపారు. రైతులకు ఇది మంచి అవకాశం అని వివరించారు. వెంటనే ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. జిల్లాలో ఎక్కువగా మిరపను మాత్రమే పండిస్తున్నారని అలాంటి రైతుల పండ్ల తోటలవైపు మళ్లితే పెద్ద ఎత్తున లాభాలు పొందవచ్చని అన్నారు. చిన్న, సన్నకారు రైతులు ఉపాధి హామీ కింద సంపూర్ణ రాయితీతో ఉద్యాన సాగును చేసుకోవచ్చని రమణారెడ్డి ఆనంద వ్యక్తం చేశారు.

Read Also: YV Subbareddy: రక్షణ కల్పించాలంటూ టీజీ హైకోర్టును ఆశ్రయించిన వైవి సుబ్బారెెడ్డి భార్య

#FarmerSupport #FarmersWelfare #FruitFarming #HorticultureBoost Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.