हिन्दी | Epaper

AP Housing Scheme: ప్రజలకు భారీ ఊరట.. 2029 నాటికి అందరికీ పక్కా ఇళ్లు!

Tejaswini Y
AP Housing Scheme: ప్రజలకు భారీ ఊరట.. 2029 నాటికి అందరికీ పక్కా ఇళ్లు!

AP Housing Scheme: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేదవాడికి 2029 సంవత్సరం నాటికి పక్కా ఇల్లు లేదా ఇంటి స్థలాన్ని అందించడమే ప్రభుత్వ ధ్యేయమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి(Minister Parthasarathy) స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా, ఈ ఏడాది ముగిసేలోపు సుమారు 2.61 లక్షల గృహాల నిర్మాణాన్ని పూర్తి చేసి, లబ్ధిదారులకు అప్పగించనున్నట్లు ఆయన వెల్లడించారు.

Read Also: Jagan 2.0: ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్

AP Housing Scheme
AP Housing Scheme

7.5 లక్షల మంది ఇళ్లకు అర్హులు

ప్రభుత్వానికి అందిన 10 లక్షల దరఖాస్తులను పరిశీలించగా, సుమారు 7.5 లక్షల మంది ఇళ్లకు అర్హులుగా ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. మిగిలిన 2.5 లక్షల మందికి కూడా ఇంటి స్థలాలను కేటాయించాలని మంత్రిమండలి నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. సొంత గృహం లేని నిరుపేదలకు ప్రాధాన్యతనిస్తూ ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870