📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

AP High Court: ANU డిగ్రీ ఫలితాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Author Icon By Anusha
Updated: June 24, 2025 • 9:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిగ్రీ కాలేజీల యాజమాన్యాల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడే కీలక ఆదేశాలు జారీ చేసింది.కాలేజీలు తప్పు చేస్తే విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయపడింది. డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు చేసిన తప్పులకు విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టకూడదని ఏపీ హైకోర్టు (AP High Court) ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) రిజిస్ట్రార్‌కు స్పష్టం చేసింది. 2022-25 బ్యాచ్ విద్యార్థుల 6వ సెమిస్టర్ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. కాలేజీల నుంచి డబ్బులు రాబట్టుకోవడానికి ఇతర మార్గాలను చూడాలని సూచించింది. కాలేజీ యాజమాన్యాలు అఫిలియేషన్, ఇతర ఫీజులు కట్టకపోతే కఠిన చర్యలు తీసుకోవచ్చని కోర్టు తెలిపింది. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని, వారి ఫలితాలను మాత్రం ఆపకూడదని తేల్చి చెప్పింది. డబ్బులు వసూలు చేయడానికి వేరే దారులు వెతకాలని సూచించింది.

స్కాలర్‌షిప్ డబ్బులు

విద్యార్థుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని వ్యాఖ్యానించింది.ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తమ విద్యార్థుల ఫలితాలను విడుదల చేయడం లేదంటూ గుంటూరు జిల్లాలోని మహాత్మా గాంధీ కాలేజీ, ప్రకాశం జిల్లాలోని కార్తికేయ డిగ్రీ కాలేజీతో పాటు మరికొన్ని ప్రైవేటు కాలేజీలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ కోర్టుకు హాజరయ్యారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తే వెంటనే ఫలితాలు విడుదల చేస్తామని అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ (Dammalapati Srinivas) కోర్టుకు తెలిపారు. విద్యార్థులు పరీక్ష ఫీజులు కట్టారని, ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్ డబ్బులు రాకపోవడంతో అఫిలియేషన్ ఫీజు కట్టలేకపోయామని కాలేజీల తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామని ఏజీ అన్నారు.

తదుపరి విచారణ

ఈ పిటిషన్‌పై విచారణను న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఈ నెల 26కి వాయిదా వేశారు. యూనివర్శిటీ రిజిస్ట్రార్‌తో మాట్లాడి సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఏజీకి సూచించారు. తదుపరి విచారణకు రిజిస్ట్రార్ (Registrar) హాజరుకావాల్సిన అవసరం లేదని తెలిపారు. ఏపీ హైకోర్టు ఫలితాలు విడుదల చేయాలన్న ఆదేశాలపై వర్శిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి, మరోవైపు ఏపీ హైకోర్టు ఫలితాలు విడుదల చేయాలన్న ఆదేశాలను డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు స్వాగతించాయి.

Read Also: Operation Sindhu : ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 10 మంది ఏపీ విద్యార్థులు

#APHighCourt #CollegeAccountability #EducationRights #StudentJustice Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.