Andhra Pradesh: అవకతవకలకు పాల్పడిన 140 మంది వైద్య సిబ్బందిని తొలగించిన ఏపీ ప్రభుత్వం

Read Time:  1 min
Andhra Pradesh: అవకతవకలకు పాల్పడిన 140 మంది వైద్య సిబ్బందిని తొలగించిన ఏపీ ప్రభుత్వం
FONT SIZE
GET APP

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.వైద్యులు, సిబ్బందిని విధుల నుంచి తప్పించేయాలని ఆదేశించింది. దాదాపు 140 మంది వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు నమోదులో అవకతవకలకు పాల్పడ్డారని,వారందరికి ఉద్యోగుల నుంచి తొలగించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. పీహెచ్‌సీలు, ఇతర ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బంది ఎఫ్‌ఆర్‌ఎస్‌ (ముఖఆధారిత హాజరు నమోదు)లో అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ‘పట్టణాల్లో నివసించే వైద్యులు, ఇతర సిబ్బంది సకాలంలో ఆసుపత్రులకు చేరుకోవడం లేదు,అయినా నిర్ణీత సమయంలోనే విధులకు వచ్చినట్లు సమయ వేళలను ఐ-ఫోన్‌ సాంకేతికతతో మార్చారు. ఈ విషయాన్ని అధికారులు గుర్తించారు’ ఈ కారణంతోనే వారందరిని తప్పించాలని ఆదేశించారు.మరోవైపు భారత్‌ పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి తర్వాత,కేంద్రం సూచనల మేరకు అత్యవసర సమయంలో వైద్య సేవలపరంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది.అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించింది. డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ ఆధ్వర్యంలో నడిచే జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు సహా ఇతర సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు డీసీహెచ్‌ సిరి ఓ ప్రకటనలో తెలిపారు. ‘అత్యవసర సమయంలో ఎలా వైద్యాన్ని అందించాలన్న దానిపై ఆసుపత్రుల్లో మాక్‌డ్రిల్‌ నిర్వహించాలి. ఆక్సిజన్‌ సదుపాయాన్ని మెరుగుపరచాలి. జనరేటర్లను సిద్ధంగా ఉంచాలి. అవసరమైతే వాలంటీర్ల సాయం కోరేందుకు వీలుగా జాబితాలు సిద్ధంచేయాలి’ అని వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల అధికారులను సిరి ఆదేశించారు.

 Andhra Pradesh: అవకతవకలకు పాల్పడిన 140 మంది వైద్య సిబ్బందిని తొలగించిన ఏపీ ప్రభుత్వం

వైద్య మండలి

ఇటీవల ఏపీ ప్రభుత్వం ఫైబర్ నెట్‌లో కూడా ఉద్యోగుల్ని తొలగించిన సంగతి తెలిసిందే వరుసగా ఉద్యోగుల్ని తొలగిస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఉద్యోగుల నియామకం విషయంలో అవకతవకలు జరిగాయనే కారణాలతో వీరిని తప్పించారు.ఆంధ్రప్రదేశ్ నూతన వైద్య మండలి ఛైర్మన్‌‌గా డాక్టర్ శ్రీహరిరావు విజయవాడలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వైద్య విద్యలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేసే విధానాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. అలాగే విద్యార్థులను ప్రోత్సహించేందుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ విధానాన్ని అమలుచేశారని, 2019 నుంచి నిలిపేశారన్నారు. ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌లో యూనివర్శిటీ, కాలేజీల స్థాయిలో ప్రతిభ చూపిన వారికి బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలను 2025-26 విద్యాసంవత్సరం నుంచి అందజేస్తామన్నారు.

Read Also :High Court: కేఏ పాల్ 5లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆజ్ఞ

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.