ప్రభుత్వ స్కూళ్లకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్

Read Time:  1 min
AP govt
AP govt
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.1450 కోట్లతో స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లులు, క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామని గురుకుల స్కూళ్ల కార్యదర్శి మస్తానయ్య ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా విద్యార్థులకు ఆధునిక వసతులు అందించడమే లక్ష్యమని ఆయన వివరించారు.

2026 నాటికి రాష్ట్రంలోని 855 స్కూళ్లలో ఈ ఆధునిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు మస్తానయ్య తెలిపారు. దీని ద్వారా విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెరగడంతో పాటు వారి ప్రగతికి తోడ్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చిత్తూరు జిల్లా కలికిరి, పీలేరు గురుకులాలను జూనియర్ కాలేజీలుగా మార్చాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు మస్తానయ్య వెల్లడించారు. ప్రస్తుతం గురుకులాల పరిధిలో 50 స్కూళ్లు, 10 జూనియర్ కాలేజీలు, ఒక డిగ్రీ కాలేజీ ఉన్నాయని మస్తానయ్య వివరించారు. ఈ సంస్థలన్నింటిని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థను పటిష్ఠంగా మార్చేందుకు తీసుకుంటున్న ఈ చర్యలను విద్యా వర్గాలు ప్రశంసిస్తున్నాయి.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.