📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Good Friday : గుడ్ ఫ్రైడే వేళ పాస్టర్‌లకు ఏపీ సర్కార్ శుభవార్త

Author Icon By sumalatha chinthakayala
Updated: April 18, 2025 • 7:10 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Good Friday : గుడ్ ఫ్రైడే ముందు రోజు పాస్టర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం విడుదలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2024 మే నుంచి నవంబర్ వరకు గౌరవ వేతనం విడుదల చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది ప్ర‌భుత్వం. ఏడు నెలల కాలానికి గాను రూ.30 కోట్లు విడుదల చేయ‌గా.. ఒకొక్క పాస్టరుకు రూ.35,000 చొప్పున లబ్ధి చేకూర‌నుంది.

పాస్టర్లకు గౌరవ వేతనాలు చెల్లింపు

రాష్ట్రంలోని పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లింపు కోసం రూ. 30 కోట్లు బడ్జెట్ ను మైనారిటీ సంక్షేమ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గురువారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. 2024 మే నెల నుంచి నవంబరు వరకు(7 నెలలు) పాస్టర్లకు గౌరవ వేతనాలు చెల్లింపు కోసం ఈ మొత్తాన్ని విడుదల చేయడం జరిగిందన్నారు.

రూ. 30 కోట్లు మొత్తాన్ని విడుదల

రాష్ట్రంలోని 8,427 మంది పాస్టర్లకు త్వరలోనే క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వారి వారి బ్యాంక్ అకౌంట్లకు గౌరవ వేతనాన్ని జమ చేయడం జరుగుతుందని తెలిపారు. గుడ్ ఫ్రైడే ముందు రోజున ప్రభుత్వం పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలు చెల్లింపు కోసం రూ. 30 కోట్లు మొత్తాన్ని విడుదల చేయడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతున్నదని అన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్రంలోని క్రైస్తవులందరికీ శుభాకాంక్షలను మైనారిటీ శాఖా మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు.

Read Also: మంత్రి నాదెండ్ల అధ్యక్షత బ్యాంకర్స్ తో సమావేశం

AP Government Breaking News in Telugu Good Friday Google news Google News in Telugu Honorarium Latest News in Telugu Paper Telugu News pastors Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.