AP: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం..ఇద్దరి అరెస్ట్

Read Time:  1 min
AP: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం..ఇద్దరి అరెస్ట్
FONT SIZE
GET APP

(AP) ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ముఠాలు పేట్రేగిపోతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పేషీ పేరునే వాడుకుంటూ లక్షలు దండుకుంటున్న ఉదంతం తాజాగా అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది. డీఎస్సీలో ఎస్జీటీ పోస్టు ఇప్పిస్తామని నమ్మించి ఓ మహిళ నుంచి రూ.12 లక్షలకు పైగా వసూలు చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: AP: సైనా నెహ్వాల్‌పై మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు

AP: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం..ఇద్దరి అరెస్ట్
Fraud committed in the name of government jobs; two arrested.

డబ్బులిస్తే ఉద్యోగాలొస్తాయని నమ్మొద్దన్న ఎస్పీ

(AP) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోలుగుంట మండలానికి చెందిన ఓ మహిళకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని నిందితులు నమ్మించారు. ప్రధాన నిందితుడు ప్రకాశం జిల్లా నాయుడుపాలెం గ్రామానికి చెందిన ఎర్రగొర్ల శ్రీను కాగా, ఇతనికి విజయవాడకు చెందిన షేక్ సలీం సహకరించాడు. తనకు సీఎం చంద్రబాబు పేషీలో ఉన్నతాధికారులతో సన్నిహిత పరిచయాలు ఉన్నాయని, కచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీను బాధితురాలిని మభ్యపెట్టాడు. ఇది నమ్మిన సదరు మహిళ నుంచి నిందితులు విడతలవారీగా రూ.12 లక్షలకు పైగా నగదు వసూలు చేసి మోసగించారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ.. ప్రధాన నిందితుడు ఎర్రగొర్ల శ్రీను పాత నేరస్తుడని వెల్లడించారు. గతంలో కూడా ఇతను ఎస్సై, లైన్‌మెన్ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసిన చరిత్ర ఉందని తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎవరైనా ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగితే నమ్మవద్దని, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ ప్రజలకు సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:



Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.