📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

బ‌డ్జెట్‌పై జీవీ రెడ్డి ప్ర‌శంస‌లు

Author Icon By Anusha
Updated: March 1, 2025 • 12:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై ఏపీ ఫైబర్‌నెట్ మాజీ ఛైర్మన్ జీవీ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అతి తక్కువ రెవెన్యూ లోటుతో రూ. 3.22 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రణాళికాబద్ధంగా రూపొందించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రశంసించారు.

జీవీ రెడ్డి ట్వీట్

“నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం రూ. 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే రూ. 3 లక్షల 22 వేల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రణాళికాబద్ధంగా రూపొందించారు. నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం వుంటాయి.తక్కువ కాలంలోనే టీడీపీలోనూ, ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత” అని జీవీ రెడ్డి ట్వీట్ చేశారు.

రాజకీయ ప్రస్థానం

గతంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తరఫున రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న జీవీ రెడ్డి, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా సేవలందించారు.అయితే, ఇటీవ‌ల జీవీ రెడ్డి వ్యక్తిగత కారణాలతో ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పినా, చంద్రబాబు నాయుడు పట్ల తనకు ఉన్న గౌరవం ఎప్పటికీ మారదని స్పష్టం చేశారు.

2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థిక పరమైన సంస్కరణలు, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారు. తక్కువ రెవెన్యూ లోటుతో అధిక వ్యయ బడ్జెట్ రూపొందించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాహసోపేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత” అని జీవీ రెడ్డి ట్వీట్ చేశారు. 

#AndhraPolitics #AndhraPradesh #APBudget2025 #APDevelopment #budget2025 #ChandrababuNaidu #FiberNet #GVReddy #PublicWelfare #TDP Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.