AP: విద్యతోనే సమాజంలో మార్పు: సీఎం చంద్రబాబు

Read Time:  1 min
Change in society is possible only through education: CM Chandrababu
Change in society is possible only through education: CM Chandrababu
FONT SIZE
GET APP

చదువు అనేది నిజమైన గేమ్‌ఛేంజర్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వ్యక్తి మాత్రమే కాకుండా సమాజం కూడా అభివృద్ధి చెందాలన్న ఆలోచన మన సంస్కృతిలో భాగమని తెలిపారు. ఆర్థిక అసమానతలు తగ్గితేనే దేశం ముందుకు సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో స్థిరమైన విజయాన్ని సాధించవచ్చన్నారు.

Read also: CM Chandrababu Naidu: రేపు కుప్పం పర్యటనలో ఈ-సైకిళ్ల పంపిణీ

Change in society is possible only through education: CM Chandrababu

Change in society is possible only through education: CM Chandrababu

ఏపీజే అబ్దుల్ కలాం నుంచి నేర్చుకోవాల్సిన విలువలు

భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు చెప్పగానే విద్య, క్రమశిక్షణ, సేవా భావం గుర్తుకు వస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తిగా కలాం గుర్తింపు పొందారని పేర్కొన్నారు. యువత చదువుతో పాటు సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

జీజీహెచ్‌లో మాతా–శిశు సంరక్షణ కేంద్ర ప్రారంభం

గుంటూరులోని జీజీహెచ్ (Guntur Government General Hospital) లో నూతనంగా నిర్మించిన మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ భవనాన్ని మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు రూ.100 కోట్ల విరాళంతో నిర్మించడం విశేషం. ప్రజారోగ్య రంగంలో ఇది కీలక ముందడుగు అని సీఎం తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.