AP: త్వరలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్: చంద్రబాబు

Read Time:  1 min
AP: త్వరలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్: చంద్రబాబు
FONT SIZE
GET APP

రాజకీయాల్లో మహిళా సాధికారతపై ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శనివారం కుప్పంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ను త్వరలోనే అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. శనివారం కుప్పంలో ఆయన మాట్లాడుతూ.. ‘మహిళా నాయకత్వం రావాలి. మగవారితో సమానంగా ముందుకెళ్లాలి. వారికి ఎన్టీఆర్ ఆస్తి హక్కు కల్పిస్తే నేను కాలేజీల్లో, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ ఇచ్చాను. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. తొందర్లోనే అది జరుగుతుంది. మహిళలు పెద్దఎత్తున ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు’ అని పేర్కొన్నారు.

Read Also: Arava Sridhar Case: జాతీయ స్థాయికి జనసేన ఎమ్మెల్యే వివాదం

AP: 33% reservation for women in legislative assemblies soon: Chandrababu
AP: 33% reservation for women in legislative assemblies soon: Chandrababu

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.