ఆంధ్రప్రదేశ్ (AP) లో కొబ్బరి ధరలు.. రైతులకు తీరని నష్టాలు మిగిల్చాయి. ఒకానొక సందర్భంలో వెయ్యి కొబ్బరి కాయల ధర 26 వేల రూపాయలు పలికింది. ఆ తర్వాత అదే స్థాయిలో రేటు పడిపోయింది. (AP) దీంతో రైతులు, వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొబ్బరి రైతులకు ఊరట కలిగించే వార్త చెప్పారు.
Read Also: CM Chandrababu: నేడు అయోధ్యకు వెళ్లనున్న సీఎం

200కోట్లు సాయం
కొబ్బరి రైతులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కోరారు. సరైన మార్కెటింగ్ లేక రైతులు నష్టపోతున్నారని, ఈ నిధులతో ‘ఇంటిగ్రేటెడ్ కోకోనట్ డెవల్పమెంట్ అండ్ మార్కెట్ స్ట్రెత్నింగ్ ప్రోగ్రామ్’ అమలు చేసి వారి ఆదాయాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ పథకం రైతులకు, గ్రామీణ ఉపాధికి మేలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: