हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: గుంటూరులో కొత్తగా మరో ఫ్లైఓవర్

Anusha
Andhra Pradesh: గుంటూరులో కొత్తగా మరో ఫ్లైఓవర్

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు వాసుల ఎన్నో ఏళ్ల కల నెరవేరనుంది. నగరంలో ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. గుంటూరు శంకర్‌ విలాస్‌ ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. మే 7వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకర్ విలాస్ రోడ్డు ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన కోసం గుంటూరు నగర పాలక సంస్థ అధికారులు ఇప్పటికే స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు గుంటూరు శంకర్ విలాస్ రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.98 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.శంకర్‌ విలాస్‌ వంతెన గుంటూరు నగరంలో ట్రాఫిక్‌ పరంగా అత్యంత కీలకమైంది. గుంటూరు ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాలను కలపడంతో పాటు రైల్వేస్టేషన్, మార్కెట్, గవర్నమెంట్, ప్రైవేట్ ఆస్పత్రులు ఇలా దేనికి వెళ్లాలన్నా ఈ వంతెన గుండా వెళ్లాల్సిందే. అయితే ఈ ఫ్లైఓవర్‌ ఇరుకుగా మారడంతోట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే వంతెన శిథిలావస్థకు చేరుకోవటంతో శంకర్ విలాస్ రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. అయితే దశాబ్దాలుగా ప్రతిపాదనలకే పరిమితమైన ఈ ప్రాజెక్టులో ఇటీవల కదలిక వచ్చింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ప్రాజెక్టులో కదలిక వచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

అధికారులు

మరోవైపు శంకర్‌ విలాస్‌ రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు డిజైన్లు సిద్ధం చేశారు. రోడ్డు ఓవర్ బ్రిడ్జి కారణంగా నష్టపోయే భవన యజమానులకు ఇప్పటికే పరిహారం కూడా అందించారు. మరోవైపు శంకర్ విలాస్ రోడ్డు ఓవర్ బ్రిడ్జికి కావాల్సిన స్థలాన్ని గుంటూరు నగరపాలక సంస్థ సేకరించాల్సి ఉంది. భూసేకరణ తర్వాత రోడ్లు భవనాల శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు 120 అడుగుల మేర భూమిని సేకరిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఇప్పటికే మార్కింగ్‌ కూడా పూర్తి చేశారు.

 Andhra Pradesh: గుంటూరులో కొత్తగా మరో ఫ్లైఓవర్

ఓవర్ బ్రిడ్జి

మరోవైపు శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణం కోసం అధికారులు పలు డిజైన్లు సిద్ధం చేశారు. గుంటూరు సర్వజనాసుపత్రి మార్చురీ ఎదురు నుంచి అరండల్‌పేట 6 లేదా 7వ లైను వరకు రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక ఈ వంతెన మీద రాకపోకలు సాగించే వాహనాలు బ్రిడ్జి దిగిన వెంటనే యూటర్న్‌ తీసుకోకుండా సర్వీసు రోడ్లలోకి వెళ్లేలా డిజైన్లు సిద్ధం చేస్తున్నారు. డిజైన్లపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చినట్లు తెలిసింది.

Read Also: Boma Akhila Priya: నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు: భూమా అఖిలప్రియ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870