📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Visakhapatnam : కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం

Author Icon By sumalatha chinthakayala
Updated: April 19, 2025 • 1:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Visakhapatnam : విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంలో అధికార పక్షం నెగ్గింది. మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 74 మంది సభ్యులు ఓట్లు వేయడంతో హరివెంకట కుమారి మేయర్ పీఠాన్ని కోల్పోయారు. దాంతో వైసీపీ నుంచి వైసీపీకి విశాఖ మేయర్ పీఠం దూరమైంది. ఓటింగ్ కు వైసీపీ సభ్యులు దూరంగా ఉన్నారు.

జీవీఎంసీ ఆఫీసు వద్ద భారీగా పోలీసు బందోబస్తు

కూటమి సభ్యులు త్వరలో విశాఖ మేయర్ ను ఎన్నుకోనున్నారు. కోరం సరిపోవడంతో ఇంచార్జ్ సమావేశం నిర్వహించారు. వైసీపీ నుంచి కూటమిలో చేరిన కార్పొరేటర్లు సైతం అవిశ్వాసంపై వ్యతిరేకంగా ఓటు వేయడంతో కూటమి తన పంతం నెగ్గించుకుంది. మరోవైపు మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ఓటింగ్ ఉండటంతో జీవీఎంసీ ఆఫీసు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించగా.. మద్దతుగా 74 ఓట్లు

గత కొన్ని రోజులుగా విశాఖ మేయర్ పీఠంపై నెలకొన్న సస్సెన్స్ వీడింది. కొందరు వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దాంతోవిశాఖ మేయర్‌పై అవిశ్వాసం పెట్టారు. దాదాపుగా 30 మంది జీవీఎంసీ కార్పొరేటర్లు కూటమి పార్టీలలో చేరి మద్దతు ప్రకటించారు. దాంతో యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకటకుమారి మేయర్‌ పీఠం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. శనివారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి కావాల్సిన కోరం ఉండటంతో ఇంచార్జ్ సమావేశం నిర్వహించి, మేయర్ పై అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించగా.. మద్దతుగా 74 ఓట్లు రావడంతో వైసీపీ మేయర్ పీఠాన్ని కోల్పోయింది. తమ గెలుపుతో కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

Read Also: హైకోర్టును ఆశ్రయించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Another mayoral seat Breaking News in Telugu Google news Google News in Telugu gvmc mayor Paper Telugu News Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.