📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: ఏపీలో మరో ప్రధాన రోడ్డు విస్తరణ ఎక్కడంటే?

Author Icon By Anusha
Updated: May 10, 2025 • 12:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాయలసీమలో రోడ్లపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నేషనల్ హైవేలతో పాటుగా, స్టేట్ హైవేలను విస్తరిస్తున్నారు.కేంద్రం సాయంతో కొన్ని ప్రాజెక్టుల్ని, పీపీపీ (ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంలో) విధానంలో కొన్ని రోడ్లను డెవలప్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో బనగానపల్లి-ప్యాపిలి మధ్య రోడ్డును రెండు వరుసలుగా మార్చనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ రోడ్డు పనులు చేపట్టనున్నారు. మొత్తం 52 కి.మీ మేర రోడ్డును విస్తరిస్తారు.ఈ మేరకు డ్రోన్ సర్వే(Drone Survey) చేసి మ్యాప్ తయారు చేస్తున్నారు. ప్రస్తుతం రోడ్డు ఒకే వరుసలో ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.బనగానపల్లి నుంచి ప్యాపిలికి ఆర్టీసీ బస్సులో వెళ్లడానికి రెండు గంటలు పడుతోంది. ఈ రోడ్డు సరిగా లేకపోవడం, ఆర్డినరీ బస్సులు మాత్రమే ఉండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బనగానపల్లి నుంచి గార్లదిన్నె వరకు సిమెంట్ లారీలు ఎక్కువగా తిరుగుతున్నాయి.ఈ క్రమంలో రోడ్డు ఇరుకుగా ఉండటంతో దద్దణాల చెరువు దగ్గర ప్రమాదాలు జరుగుతున్నాయి. బనగానపల్లి-ప్యాపిలి మార్గంలో దాదాపు 20 గ్రామాలు ఉన్నాయి. వాటిలో పాతపాడు, చిన్నరాజుపాలెం, యాగంటిపల్లె, పసుపుల, జలదుర్గం ముఖ్యమైనవి.

Andhra Pradesh

ప్రభుత్వం

సిగరమాన్‌ మెట్ట నుంచి వాహనాలు ఒకవైపు ప్యాపిలికి, మరోవైపు డోన్‌కు వెళ్తాయి. అయితే ఈ రోడ్డును ప్యాపిలి నుంచి బనగానపల్లి వరకు నిర్మించి, టంగుటూరు మీదుగా మహనంది మండలం గాజులపల్లె వద్ద అమరావతి రోడ్డులో కలిపే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ రోడ్డుకు సంబంధించి ఉన్నత అధికారులు ప్రాజెక్టు నివేదిక తయారు చేస్తున్నారని ఆర్‌అండ్‌బీ ఏఈ హుసేని తెలిపారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే దాదాపు 20 గ్రామాల ప్రజల ఇబ్బందులు తీరతాయని,అలాగే అమరావతి రోడ్డుకు(Amaravati Road) కూడా కనెక్టివిటీ పెరుగుతుందంటున్నారు. త్వరలోనే సర్వే పూర్తి చేసి మ్యాప్, డీపీఆర్ తయారు చేసి పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇటు రాయలసీమ జిల్లాల నుంచి అమరావతికి కనెక్టివిటీని పెంచే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం. అందుకే రాయలసీమలోని ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. వీలైనంత త్వరగా ఆ పనుల్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.

Read Also: Andhra Pradesh: ఆంధ్రా డిప్యూటీ కలెక్టర్‌కు సుప్రీం కోర్టు కీలక తీర్పు

#AndhraPradesh #ConnectivityBoost #InfrastructureGrowth #RayalaseemaDevelopment #RoadInfrastructure Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.