📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhrapradesh: ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Author Icon By Sharanya
Updated: March 24, 2025 • 4:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మంచి వార్త వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగుల GLI, GPF బకాయిలను వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 11:30 గంటల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలోకి బకాయిల డబ్బులు జమవుతుండగా, మొత్తం రూ. 6,200 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ నిధుల విడుదలకు సంబంధించి ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం నుంచి బుధవారం వరకు మొత్తం పూర్తిస్థాయిలో ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు కూడా ధృవీకరించారు. తమకు బకాయిలు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు, సీఎస్ విజయానంద్‌కు ఉద్యోగ సంఘాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రబాబు నిర్ణయం

గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఉద్యోగుల జీతాలు, బకాయిల చెల్లింపులు ఆలస్యమైన విషయం తెలిసిందే. అనేక ఉద్యోగ సంఘాలు జేఏసీ నేతృత్వంలో నిరసనలు వ్యక్తం చేసినా, ప్రభుత్వం సరైన విధంగా స్పందించలేదని ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శించారు. అయితే, ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం, ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఈ మేరకు గతవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల బకాయిలు తక్షణమే చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేశారు. సీపీఎస్, ఏపీజీఏఐ కింద రూ.6,200 కోట్లు విడుదల చేయడానికి ఆర్థికశాఖ లైన్ క్లియర్ చేయగా, ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. ఈ విడుదలకు సంబంధించి ఉద్యోగ సంఘాల నాయకులు స్పందిస్తూ, గత ప్రభుత్వం తీసుకున్న వైఖరి వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. జేఏసీ ఛైర్మన్ కేవీ శివారెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు విసిగిపోయారు. అందుకే ఎన్నికల్లో వారిని సాగనంపారు అని పేర్కొన్నారు. జనవరి 2024లో కూడా ప్రభుత్వం రూ.1,033 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో రూ.6,200 కోట్లు విడుదల చేయడం ద్వారా, ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకున్నట్లు ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు తమ డబ్బులు లభిస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రంలోని వ్యవసాయ విస్తరణాధికారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ సమావేశంలో ఉద్యోగుల ప్రమోషన్ల అంశంపై కూడా చర్చించారు. పంచాయతీరాజ్ శాఖలో వివిధ క్యాడర్లలో పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఎంపీడీవోలను నేరుగా నియమించే విధానాన్ని రద్దు చేసి, పరిపాలన అధికారులకు 50% ఖాళీలు కేటాయించాలన్న తీర్మానాన్ని ఆమోదించారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల జీతాలు ముందుగానే జమ చేయడం మరో ముఖ్యమైన పరిణామం. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల చెల్లింపులు ఒకవైపు సాగుతుండగా, మరోవైపు శిక్షణ కార్యక్రమాల్లో నిమగ్నమైన ఉద్యోగుల జీతాల కూడా ముందుగానే చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

#AndhraPradesh #apemployees #apgovt #Chandrababu #EmployeesWelfare #GLIPayment #GPFPayment #TDP Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.