Andhra Pradesh: ఎనిమిదిమంది ఉద్యోగులపై వేటు

Read Time:  1 min
Andhra Pradesh: ఎనిమిదిమంది ఉద్యోగులపై వేటు
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పల్నాడు జిల్లాలో పనిచేస్తున్న ఎనిమిది మంది మెప్మా (MEPMA) ఉద్యోగులపై వేటు పడింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఎనిమిది మందిని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు ఉద్యోగులు రాజకీయ నేతలతో కలిసి నకిలీ గ్రూపుల్ని ఏర్పాటు చేసి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏకంగా రూ.4 కోట్ల మేర రుణాలు తీసుకుని అవినీతి చేసినట్లు తేలింది. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సీఎం చంద్రబాబుకు ఈ అవినీతి గురించి వివరించారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి, వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read Also: Jaahnavi: అమెరికాలో విద్యార్థిని మృతి.. రూ.262 కోట్ల నష్ట పరిహారం

Andhra Pradesh: Eight employees dismissed
Andhra Pradesh: Eight employees dismissed

సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ

అక్కడితో ఆగకుండా వారి నుంచి డబ్బులు రికవరీ కాకపోతే ఆస్తులు స్వాధీనం చేసుకోవాలన్నారు.సీఎం చంద్రబాబు ఆదేశాలతో కలెక్టర్ మెప్మా ఉద్యోగుల్ని సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. చిలకలూరిపేట కమ్యూనిటీ ఆర్గనైజర్‌ మల్లికార్జునరావు, నరసరావుపేట కమ్యూనిటీ ఆర్గనైజర్‌ భూదేవి, గురజాల కమ్యూనిటీ ఆర్గనైజర్.

శ్రీనివాసరావు, పిడుగురాళ్లకు చెందిన కమ్యూనిటీ ఆర్గనైజర్ బాలాంజనేయులు, నరసరావుపేట మెప్మా ఆఫీసులో సిటీ మిషన్‌ మేనేజర్‌ తుమ్మా దీప, కమ్యూనిటీ ఆర్గనైజర్‌ విజయ ప్రణతి, సిటీమిషన్‌ మేనేజర్‌ జి.శ్రీనివాసరావు (పిడుగురాళ్ల), సిటీ మిషన్‌ మేనేజర్‌ ఉమర్‌వలి (వినుకొండ)లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.