ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని, విశాఖపట్నంలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే పదవీ విరమణ చేసిన పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఎస్ఈ శ్రీనివాసరావు నివాసంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. విశాఖ మధురవాడలో ఉన్న నివాసంతో పాటు సమీప బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. సాలూరులో శ్రీనివాసరావు బంధువు నారాయణరావుతో పాటు హైదరాబాద్ లోని ఇతర బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Read Also: Chandrababu Naidu: ప్రత్యర్థుల కుట్రలు తిప్పికొడతాం

Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: