News telugu: Amrapali: క్రీడల ద్వారా పర్యాటకానికి, రాష్ట్ర సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు నిర్ణయం: ఆమ్రపాలి

Read Time:  1 min
News telugu
News telugu
FONT SIZE
GET APP

విజయవాడ: క్రీడల ద్వారా రాష్ట్ర సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇండియా ఖేలో పుట్ బాల్ తో ఏపీ పర్యాటక శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుందని, ఇదొక మైలురాయిగా ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయి యువ ప్రతిభను వెలికితీయడం, సాధికారత కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)పర్యాటక శాఖ, ఇండియా ఖేలో ఫుట్బాల్ (ఐకెపి ) తో కలిసి “టైగర్ క్యాపిటల్ ఐకెపి స్కౌట్ ఆన్ వీల్స్” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనుంది.

News telugu
News telugu

45 రోజులపాటు ఫుట్బాల్ రోడ్

ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి (APTDC MD Amrapali)కాట పర్యవేక్షణలో 45 రోజులపాటు ఫుట్బాల్ రోడ్ జరుగనుంది. విశాఖపట్నం, రాజమండ్రి, సత్తెనపల్లి, విజయవాడ, కర్నూలు, అనంతపురం, తిరుపతి వంటి ఏడు ప్రధాన నగరాలకు చేరుకోనున్న రోడ్ షోలో పదికి పైగా చిన్న పట్టణాల్లో ఫుట్బాల్ ట్రయల్స్, క్లినిక్స్, పేరెంట్ వర్క్షాప్లు, బాలికలకు సాధికారత కల్పించే సెషన్ను నిర్వహించనున్నారు. సందర్భంగా ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట మాట్లాడుతూ పర్యాటకం అంటే కేవలం ప్రదేశాలు చూడటమే కాదు, ప్రజల కథలను, వారి సంస్కృతిని గొప్పగా చెప్పడమన్నారు. స్కౌట్ ఆన్ వీల్స్ కు మద్దతు ఇవ్వడం ద్వారా తాము యువ సాధికారతను, ఆత్మగౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ నలుమూలలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఫుట్బాల్ ద్వారా ఆంధ్రాను కనుగొనండిఖి అనే నినాదంతో రాష్ట్రానికి ఉన్న పర్యాటక అవకాశాలకు, సంస్క ృతికి, యువ శక్తికి కేంద్రంగా నిలుపుదాం” అని పిలుపునిచ్చారు.టైగర్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈఓ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ, స్కౌట్ ఆన్ వీల్స్ టైటిల్ పార్టనర్గా ఉండటం తమకు గర్వకారణం అన్నారు. ఒక ఎన్ బీఎఫ్ సీగా, ఆర్థిక స్వేచ్ఛతో కమ్యూనిటీలకు సాధికారత కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తమ 27 బ్రాంచ్ల వాలంటీర్లు తల్లిదండ్రులు, అవకాశాలను క్రీడాకారులతో నేరుగా కలిసి వారికి ఆర్థిక అక్షరాస్యతను, యువతకు అప్రెంటిస్ షిప్లను, కుటుంబాలకు ఉద్యోగ కల్పించనున్నారని పేర్కొన్నారు. ఇది కేవలం రుణాలు ఇవ్వడం కాదు, కుటుంబాలకు కలలు కనే స్వేచ్ఛను ఇవ్వడం
కూడా అని ఆయన వెల్లడించారుఐకెపి వ్యవస్థాపకుడు ఫణి భూషణ్ మాట్లాడుతూ వుట్బాల్ భారతదేశంలోని ప్రతి ఇంటికీ చెందాలని తాము నమ్ముతామన్నారు. స్కౌట్ ఆన్ వీల్స్ ను ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడం ద్వారా, ఫుట్ బాల్ అవకాశాలు కొన్ని రాష్ట్రాలకే
మేము పరిమితం కాదని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/heavy-security-arrangements-for-tirumala-srivari-brahmotsavam/devotional/549903/

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.