సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సభ్యులు ఎన్. వరదరాజ్
AI Groundwater Estimation: భూగర్భజల వనరుల అంచనా, సమర్థనిర్వహణ, వినియోగానికి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సాంకేతిక పద్ధతులను విస్తృతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు (సిజిడబ్ల్యూబి) సభ్యులు ఎన్. వరదరాజ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూగర్భ జలాల రంగంలో అద్భుతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
సీజిడబ్ల్యూబి ఆధ్వర్యంలో విజయవాడలోని ఓ హోటల్లో రాష్ట్రానికి చెందిన భూగర్భ జలాల డేటా, అక్విఫర్ (జలధార పొరలు) మ్యాపింగ్ ఫలితాల ప్రచారంపై రాష్ట్రస్థాయి వర్క్షాప్ జరిగింది. దీనిలో 150 మందికి పైగా జిల్లా, రాష్ట్రస్థాయి సమన్వయ శాఖాధికారులు, భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: AP Tax QR Code: ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్.. పన్నుల చెల్లింపు ఇక మరింత ఈజీ!

ఏఐ ఆధారిత నమూనాలు
ఈ సందర్భంగా రాష్ట్ర డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ – 2025, నేషనల్ ఆక్విఫర్ మ్యాపింగ్ అండ్ మేనేజ్మెంట్ నివేదికలను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సభ్యులు (ఇంజనీరింగ్) ఎన్. వరదరాజ్ మాట్లాడుతూ వాతావరణ మార్పులు, వర్షపాతంలో లోపాలు, అధిక వినియోగం కారణాలతో భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో శాస్త్రీయ ఆధారిత డేటా సేకరణ, విశ్లేషణ అవసరమన్నారు. ఏఐ ఆధారిత నమూనాల ద్వారా భూగర్భ జలాలల నిల్వలు, రీచార్జ్ సామర్థ్యం, వినియోగ ధోరణులు తదితర అంశాలను ముందస్తుగా ఖచ్చితత్వంతో అంచనా వేయవచ్చన్నారు. “ఇన్- గ్రెస్” సాఫ్ట్వేర్ వినియోగం ద్వారా భూగర్భ జల వనరుల నిర్వహణ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: