हिन्दी | Epaper

Adinarayana Reddy: వైసీపీ కాలం పూర్తైంది.. అధికారంలోకి BJP వస్తుంది: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి

Sharanya
Adinarayana Reddy: వైసీపీ కాలం పూర్తైంది.. అధికారంలోకి BJP వస్తుంది: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఓ ప్రధానాంశంగా మారింది. ఈ హత్య కేసుపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఘాటుగా స్పందించారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి హత్యకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసని ఆయన ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా ఈ విషయం బయటపడిందని చెప్పారు.

వివేకా హత్య కేసుపై జగన్, అవినాష్ పాత్ర?

ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జగన్ కుటుంబం మొత్తం ఈడీ, సీబీఐ కేసుల్లో ఇరుక్కుపోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. కడప జిల్లాకు పరువు తీసిన ఘనకార్యం వైసీపీదేనని ఆయన అన్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ముద్దాయిలా వ్యవహరించడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, వారు చేసిన పాపాలన్నింటినీ మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజం ఎప్పుడూ బయటపడుతుంది. వాళ్లే హత్యకు బాధ్యత వహించాలి అంటూ అన్నారు. అదే విధంగా, సీఎం జగన్‌ను ఉద్దేశించి ఎవరు చనిపోయినా జిల్లాకు వచ్చి పరామర్శల పేరుతో రాజకీయాలు చేయడం జగన్‌కు అలవాటే. ఆయనకు పరామర్శలు కాదు ప్రజలను మోసం చేసే రాజకీయ డ్రామాలు బాగా వస్తాయి అంటూ విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ రెండు, మూడేళ్లలో ఎన్నికలు వస్తాయని, తాను మళ్లీ సీఎం అవుతానని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉంది. జమిలి ఎన్నికలు వస్తే వైసీపీకి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు కూడా రాకుండా చూస్తాం అంటూ ఆయన ప్రకటించారు. వైసీపీ పాలన ప్రజలను విసిగించింది. జగన్ ప్రభుత్వంపై ప్రజలకు విరక్తి వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి కూటమిగా వస్తే వైసీపీ పార్టీకి ఇక తుదివేళ వచ్చేసినట్లే అంటూ అన్నారు. జగన్‌కి నిజమైన దైవభక్తి ఉంటే వివేకానందరెడ్డి హత్యపై నిజం చెప్పాలని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైసీపీ పాలనలో జరిగిన స్కాంలు చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా చిన్నదిగా కనిపిస్తుంది. వైసీపీ హయాంలో మరింత పెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా పూర్తిగా నాశనం చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జగన్ ప్రభుత్వం, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870