हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Adinarayana Reddy: వైసీపీ కాలం పూర్తైంది.. అధికారంలోకి BJP వస్తుంది: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి

Sharanya
Adinarayana Reddy: వైసీపీ కాలం పూర్తైంది.. అధికారంలోకి BJP వస్తుంది: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఓ ప్రధానాంశంగా మారింది. ఈ హత్య కేసుపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఘాటుగా స్పందించారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి హత్యకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసని ఆయన ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా ఈ విషయం బయటపడిందని చెప్పారు.

వివేకా హత్య కేసుపై జగన్, అవినాష్ పాత్ర?

ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జగన్ కుటుంబం మొత్తం ఈడీ, సీబీఐ కేసుల్లో ఇరుక్కుపోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. కడప జిల్లాకు పరువు తీసిన ఘనకార్యం వైసీపీదేనని ఆయన అన్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ముద్దాయిలా వ్యవహరించడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, వారు చేసిన పాపాలన్నింటినీ మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజం ఎప్పుడూ బయటపడుతుంది. వాళ్లే హత్యకు బాధ్యత వహించాలి అంటూ అన్నారు. అదే విధంగా, సీఎం జగన్‌ను ఉద్దేశించి ఎవరు చనిపోయినా జిల్లాకు వచ్చి పరామర్శల పేరుతో రాజకీయాలు చేయడం జగన్‌కు అలవాటే. ఆయనకు పరామర్శలు కాదు ప్రజలను మోసం చేసే రాజకీయ డ్రామాలు బాగా వస్తాయి అంటూ విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ రెండు, మూడేళ్లలో ఎన్నికలు వస్తాయని, తాను మళ్లీ సీఎం అవుతానని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉంది. జమిలి ఎన్నికలు వస్తే వైసీపీకి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు కూడా రాకుండా చూస్తాం అంటూ ఆయన ప్రకటించారు. వైసీపీ పాలన ప్రజలను విసిగించింది. జగన్ ప్రభుత్వంపై ప్రజలకు విరక్తి వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి కూటమిగా వస్తే వైసీపీ పార్టీకి ఇక తుదివేళ వచ్చేసినట్లే అంటూ అన్నారు. జగన్‌కి నిజమైన దైవభక్తి ఉంటే వివేకానందరెడ్డి హత్యపై నిజం చెప్పాలని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైసీపీ పాలనలో జరిగిన స్కాంలు చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా చిన్నదిగా కనిపిస్తుంది. వైసీపీ హయాంలో మరింత పెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా పూర్తిగా నాశనం చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జగన్ ప్రభుత్వం, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870