📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి

Author Icon By Sharanya
Updated: April 3, 2025 • 3:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రేమికుల దినోత్సవం రోజునే ఏపీలో దారుణం జరిగింది ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో ఓ యువతిపై కత్తితో దాడి చేసి, అనంతరం యాసిడ్ దాడికి తెగబడిన ఘటన అన్నమయ్య జిల్లాలో సంచలనం రేపింది. ప్రేమికుల దినోత్సవం రోజున జరిగిన ఈ అమానవీయ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గౌతమిపై ప్రేమ పేరుతో వేధింపులు:
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లి గ్రామానికి చెందిన గౌతమి, మదనపల్లెలో డిగ్రీ పూర్తి చేసి, ప్రస్తుతం కదిరి రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. అయితే, మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ ఆమెను ప్రేమించమంటూ కొంతకాలంగా వేధిస్తున్నాడు.

వివాహ నిశ్చయం – ప్రేమోన్మాది కిరాతక పథకం:
ఫిబ్రవరి 7న గౌతమికి పెళ్లి నిశ్చయం కాగా, ఏప్రిల్ 29న పీలేరుకు చెందిన శ్రీకాంత్‌తో వివాహం జరగాల్సి ఉంది. ఈ విషయం తెలిసిన గణేష్ ఆమెను వేధించడం మితిమీరడంతో ఈ ఘోరానికి పాల్పడ్డాడు. యువతికి వివాహం నిశ్చయమైందని తెలుసుకుని ఇలా దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.

దారుణ దాడి :
ఫిబ్రవరి 14న, గౌతమి తల్లిదండ్రులు పాలు పిండటానికి వెళ్లిన సమయాన్ని ఆసరాగా తీసుకుని గణేష్ ఆమె ఇంట్లోకి చొరబడి, కత్తితో తలపై దాడి చేశాడు. దాంతో ఆగకుండా యాసిడ్ దాడికి కూడా పాల్పడ్డాడు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు:
దాడిలో తీవ్రంగా గాయపడిన గౌతమిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని గౌతమి వివరాలు తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి నిందితుడు గణేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇలాంటి అమానుష దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

#acidattack #AndhraPradesh #crimenews #justiceforvictim #womansaftey #youthcrime Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.