📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడే బడ్జెట్: పార్ధసారధి

Author Icon By Sharanya
Updated: February 12, 2025 • 11:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పార్ధసారధి వ్యాఖ్యలు : సమగ్రాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ సిద్ధం రాష్ట్ర అభివృద్ధికి 2047 విజన్‌ను అనుసరించి 15 శాతం వృద్ధి రేటును సాధించడానికి, తలసరి ఆదాయం 42,000 డాలర్లకు పెంచే లక్ష్యంగా ఎటువంటి చర్యలు చేపట్టాలో మేధోమథనాన్ని తీవ్రతరం చేసి పటిష్ఠమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. రాష్ట్ర అభివృద్దిలో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల జిఎస్‌డిపి ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, తలసరి ఆదాయం 42,000 డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో 2025-26 బడ్జెట్‌ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని సూచించారని చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు: మేధోమథనాన్ని నిర్వహించడం, పటిష్ఠమైన ప్రణాళికలను అమలు చేయడం ప్రజల ఆశల దృష్టిలో పనిచేసే విధానాలు, కార్యోన్ముఖమైన ప్రభుత్వ విధానాలు పటిష్ఠమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

ఆర్థిక ప్రణాళికలో ముఖ్యాంశాలు : మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర మంత్రులను, కార్యదర్శులను కార్యోన్ముఖులుగా చేసే విధంగా ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలను జారీ చేయడం జరిగిందన్నారు. ఫైళ్ల క్లియరెన్సు వేగవంతం చేయాలని, ఫైనాన్స్‌కు సంబంధించినవి మినహా మరే ఇతర ఫైళ్లు పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారన్నారు.

కేంద్ర ప్రభుత్వం సహకారం : రాష్ట్రానికి అనుకూలంగా బడ్జెట్ మద్దతు కేంద్రం నుండి వచ్చే నిధులను రాబట్టే విధంగా మంత్రులు, కార్యదర్శులు కృషిచేయాలని సూచించారని చెప్పారు. తెలంగాణతో పోలిస్తే జిఎస్‌డిపిలో రూ. 87,000 కోట్ల లోటు ఉందని, కొనుగోలు శక్తిని పెంచాలని పేర్కొన్నారన్నారు.

ప్రజా సేవల కోసం టెక్నాలజీ వాడకం:
భవిష్యత్తులో ఏవీ సేవలు – ప్రతి శాఖ వాట్సప్ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించి, సేవలు అందించేందుకు మరింత టెక్నాలజీని వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు అని అన్నారు.
ప్రజల కోరికల మేరకు గవర్నెన్స్ – ప్రజల డిమాండ్లు, కోరికలను తెలుసుకుని, గవర్నెన్స్ ప్రణాళికలు మరింత అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు అని చెప్పారు.

వాట్సప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందించడం:
158 సేవలు అందుబాటులో – దేవాదాయ, రెవిన్యూ, ఇంధన, ఏపీఎస్ ఆర్టీసీ, అన్న క్యాంటీన్, పీజీఆర్సీ, సీడీఎంఏ తదితర శాఖలకు సంబంధించి 158 సేవలు ప్రారంభించడం
500 సేవలు – మిగిలిన శాఖలకు సంబంధించి మరిన్ని 500 సేవలను ప్రారంభించాలనే ఆదేశం
ప్రజల అభిప్రాయాల సేకరణ – వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల కోరికలు, డిమాండ్లు, అభిప్రాయాలను తెలుసుకునే విధంగా వాట్సప్ సేవలను వినియోగించాలని ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశించారని తెలిపారు.

#AndhraPradesh #budget2025 #cm chandrababu #economic growth #kolusu parthasarathy Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.