📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

శరవేగంగా అమరావతి హైవే పనులు

Author Icon By Anusha
Updated: April 4, 2025 • 2:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేషనల్ హైవేల ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా జాతీయ రహదారి నిర్మాణ పనులు పురోగమిస్తుండగా, విశాఖపట్నం జిల్లాలో అనేక ఏళ్లుగా ఎదురు చూస్తున్న కీలకమైన నేషనల్ హైవే విస్తరణకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పెందుర్తి-బొడ్డవర 516బి జాతీయ రహదారి విస్తరణ పనులకు రూ.782.91 కోట్ల అంచనా వ్యయం కేటాయించారు.

నేషనల్ హైవే

నేషనల్ హైవే విస్తరణలో మరో ముఖ్యమైన ప్రాజెక్ట్ నంద్యాల జిల్లా చాగలమర్రి నుంచి ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం వేంపల్లె వరకు 78.95 కిలోమీటర్ల మేర సాగుతోంది. నేషనల్ హైవే 440లో విస్తరణ పనుల కోసం గత డిసెంబరులో రూ.1059 కోట్లతో టెండర్ ప్రక్రియ ముగియగా, భూసేకరణ పూర్తయింది. ఈ నెల 8వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం నుండి వర్చువల్ విధానంలో ఈ పనులకు శంకుస్థాపన చేశారు.

రహదారుల పనులు

అమరావతికి కనెక్ట్ అయ్యే రహదారుల పనులు వేగంగా సాగుతున్నాయి. గత నెల 27న ఈ రోడ్డు నిర్మాణానికి టెండర్లు ఖరారు కాగా, పనులు త్వరలో ప్రారంభమవనున్నాయి. ముఖ్యంగా అమరావతికి కనెక్ట్ చేసే రహదారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. కేంద్ర ప్రభుత్వం నడికుడి, మాచర్ల, మార్కాపురం రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించింది. ఈ హైవేకు 167ఏడిగా నామకరణం చేశారు. ఈ విస్తరణలో భాగంగా మాచర్ల బైపాస్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది.

బ్రిడ్జిలు

మాచర్ల బైపాస్‌లో మొత్తం మూడు బ్రిడ్జిలు నిర్మించగా, ఒకటి సాగర్ రహదారి మీదుగా, మరొకటి చంద్రవంక వాగుపైన, మూడవది ఎన్టీఆర్ నగర్ కాలనీలో రైల్వే బ్రిడ్జిగా ఉండనుంది. రైల్వే గేటు మూసివేసినప్పుడు స్థానికులు అనేక ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో 167ఏడి విస్తరణలో భాగంగా రైల్వే బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.రైల్వే బ్రిడ్జి పూర్తయిన తర్వాత రాయవరం జంక్షన్ నుండి బైపాస్ మీదుగా మార్కాపురం, సాగర్ వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. మాచర్ల పట్టణంలోకి ప్రవేశించకుండా ప్రయాణీకులు సులభంగా తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. నేషనల్ హైవే విస్తరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల రాష్ట్ర రహదారుల కనెక్టివిటీ మెరుగవడంతో పాటు వాణిజ్య, రవాణా సౌకర్యాలు కూడా అభివృద్ధి చెందనున్నాయి.

#AmaravatiConnectivity #AndhraPradesh #MacharlaBypass #NationalHighways #NH440 #NH516B #NHExpansion #RoadInfrastructure #VisakhapatnamDevelopment Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.