రేవంత్ నిర్ణయం ఏపీపైనా ప్రభావం

Read Time:  1 min
revanth, babu
revanth, babu
FONT SIZE
GET APP

హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్టు, విచారణ వంటి పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై సినిమాల బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పేసింది. దీంతో ఇబ్బందుల్లో పడ్డ టాలీవుడ్ .. చివరి ప్రయత్నంగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్ రాజును తీసుకెళ్లి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ భేటీతో వీరిద్దరి మధ్య దూరం తగ్గుతుందనుకుంటే మరింత పెరిగేలా ఉంది. అదే సమయంలో ఈ భేటీ ప్రభావం ఏపీపైనా పడబోతోంది.
తెలంగాణలో టాలీవుడ్ సినిమాల బెనిఫిట్ షోలకు, టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వకూడదన్న తమ నిర్ణయంలో మార్పేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పేశారు. దీంతో టాలీవుడ్ కు, అందులో భాగమైన ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజుకూ భారీ షాక్ తప్పలేదు. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రూపంలో రెండు సినిమాల విడుదలకు సిద్దమైన దిల్ రాజుకు రేవంత్ నిర్ణయం మింగుడుపడని పరిస్ధితి. అలాగే తర్వాత రాబోయే సినిమాలకూ షాక్ తప్పడం లేదు.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.