భూకబ్జాలకు జైలుశిక్ష: చంద్రబాబు

Read Time:  1 min
భూకబ్జాలకు జైలుశిక్ష: చంద్రబాబు
FONT SIZE
GET APP

భూకబ్జాలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం, కృష్ణా జిల్లా ఈడుపుగల్లులో జరిగిన రెవెన్యూ సమావేశంలో మాట్లాడారు. ఒక్క సెంటు భూమి కూడా లాక్కోకుండా జాగ్రత్తపడాలని, ఎవరైనా భూకబ్జాలకు, మోసాలకు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడితే అలాంటి వారిని జైలుకు పంపడం ఖాయమన్నారు.

భూ సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిబంధనల ప్రకారం నడుచుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. భూ రీసర్వేలో జరిగిన తప్పులను త్వరలో సరిచేస్తామన్నారు.

“మీరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్న NDA ప్రభుత్వాన్ని 57 శాతం ఓట్లతో ఎన్నుకున్నారు, మా మీద విశ్వాసం ఉంచారు. మేము గత ఆరు నెలలుగా మీ అంచనాలను నెరవేర్చడానికి కృషి చేస్తున్నాము” అని అన్నారు.

రెవెన్యూ సదస్సులు

గతంలో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసిందని ముఖ్యమంత్రి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం వల్ల రాష్ట్రంలో దారుణమైన పరిస్థితి ఏర్పడిందన్నారు.

రెవెన్యూ సదస్సులకు మూడు లక్షల మందికి పైగా హాజరయ్యారని, ఇప్పటి వరకు 95,263 అర్జీలు వచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు. పాసుపుస్తకాలపై క్యూఆర్ కోడ్‌లు, జియోట్యాగింగ్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని, దీని ద్వారా భూ రికార్డులను ఎప్పుడైనా పరిశీలించవచ్చని నాయుడు చెప్పారు.

డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం గమనార్హం.

Sukanya

రచయిత గురించి

Sukanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.