हिन्दी | Epaper
సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

ఆంధ్రాలో వేలల్లో ఉద్యోగావకాశాలు

Vanipushpa
ఆంధ్రాలో వేలల్లో ఉద్యోగావకాశాలు

ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా భారీగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలో రూ.14,000 కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్ చిప్‌ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. అయితే భారత్‌ను అంతర్జాతీయ చిప్‌ల తయారీ కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి యాక్టీవ్ చర్యలు తీసుకుంటున్నాయి. జపాన్‌కు చెందిన యిటోవా మైక్రో టెక్నాలజీ లిమిటెడ్‌ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ఆధారంగా ఆంధ్రాలోని కర్నూలు జిల్లాలోని పారిశ్రామిక పార్కులో జపాన్‌కు చెందిన కంపెనీ రూ.14,000 కోట్ల అంచనా వ్యయంతో సెమీకండక్టర్ చిప్‌ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది.

సిలికాన్ కార్బైడ్ చిప్‌ల తయారీపై దృష్టి
భారతదేశంలో ఏర్పాటు చేసిన తొలి ప్రైవేట్ సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్ ఇదేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సిలికాన్ కార్బైడ్ చిప్‌ల తయారీపై కంపెనీ దృష్టి సారిస్తుందని ఆంధ్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నవంబర్‌లో సెమీకండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ 2024-29ని విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ల తయారీ హబ్‌గా మార్చడం దీని ముఖ్య లక్ష్యం. ఈ ప్రాజెక్టు కిందనే జపాన్ కంపెనీతో ఆంధ్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. కొత్త సిలికాన్ కార్పెట్ చిప్ తయారీ ప్లాంట్ నెలకు పది వేల వేఫర్‌లను ఉత్పత్తి చేస్తుందని అలాగే రాబోయే రెండు మూడేళ్లలో నెలకు యాభై వేల వేఫర్‌లకు ఉత్పత్తి పెరుగుతుందని అంచనా.
అంతర్జాతీయంగా కృత్రిమ మేధస్సు సాంకేతికత అండ్ వివిధ పరికరాలు స్మార్ట్ పరికరాలుగా మారడంతో స్మార్ట్ చిప్‌లకు డిమాండ్ కూడా పెరిగింది. అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భారత్‌ను సెమీకండక్టర్ల తయారీ హబ్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం వివిధ ప్రత్యేక పథకాలను కూడా ప్రకటించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870