RK: మాజీ ఎమ్మెల్యే ఆర్కేపై సీఐడీ కేసు నమోదు

Read Time:  1 min
RK: మాజీ ఎమ్మెల్యే ఆర్కేపై సీఐడీ కేసు నమోదు
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)(Alla Ramakrishna Reddy) పై ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. 2021లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఈ కేసు నమోదైంది. ఈ దాడి కేసులో ఆయన్ను 127వ నిందితుడిగా సీఐడీ పోలీసులు చేర్చారు.

RK: మాజీ ఎమ్మెల్యే ఆర్కేపై సీఐడీ కేసు నమోదు
RK: మాజీ ఎమ్మెల్యే ఆర్కేపై సీఐడీ కేసు నమోదు

వివరాల్లోకి వెళితే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో, 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, ఈ దాడి కేసును కూటమి ప్రభుత్వం సీఐడీ(CID)కి అప్పగించింది. ఈ కేసు విచారణను సీఐడీ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్(Nandigam Suresh) అరెస్ట్ అయ్యారు.

Read Also: TDP: భారీగా జమ అయిన టీడీపీ విరాళాలు

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.